సిట్టింగ్ ఎంపీలకు బీజేపీ షాక్.. 67 మందికి మొండిచేయి

లోక్‌సభ ఎన్నికల్లో సొంతంగా 370 సీట్లు గెలుచుకోవాలనే లక్ష్యంతో బీజేపీ అడుగులు వేస్తోంది. దీంతో ఈసారి అభ్యర్థుల ఎంపికపై లోతుగా కసరత్తు చేస్తొంది.

సిట్టింగ్ ఎంపీలకు బీజేపీ షాక్.. 67 మందికి మొండిచేయి

BJP two lists 67 MPs have not been given tickets

BJP Two Lists: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మూడోసారి విజయమే లక్ష్యంగా వ్యుహాలు రచిస్తోంది. అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తోంది. లోక్‌స‌భ‌ ఎన్నికల్లో పోటీ చేయబోయే 72 మంది అభ్యర్థుల పేర్లతో రెండో జాబితాను తాజాగా కాషాయ పార్టీ విడుదల చేసింది. హర్యానా మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్, కర్ణాటక మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై, ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్, కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, పియూష్ గోయల్, అనురాగ్ సింగ్ ఠాకూర్, ప్రహ్లాద్ జోషి.. సెకండ్ లిస్టులో చోటు దక్కించుకున్నారు. దీంతో ఇప్పటివరకు 267 స్థానాలకు అభ్యర్థులను బీజేపీ ఖరారు చేసినట్టయింది.

21 శాతం మంది సిట్టింగ్ ఎంపీలకు ఝలక్
లోక్‌సభ ఎన్నికల్లో సొంతంగా 370 సీట్లు గెలుచుకోవాలనే లక్ష్యంతో బీజేపీ అడుగులు వేస్తోంది. దీంతో ఈసారి అభ్యర్థుల ఎంపికపై లోతుగా కసరత్తు చేస్తొంది. వరుసగా పదేళ్లు అధికారంలో ఉన్నందున ఎంతోకొంత వ్యతిరేకత ఉంటుందన్న భావనతో సిట్టింగ్ ఎంపీలకు చాలా చోట్ల మొండిచేయి చూపించింది. రెండు లిస్టులను కలిసి ఇప్పటివరకు 21 శాతం మంది సిట్టింగ్ ఎంపీలకు సీట్లు ఇవ్వలేదు. పార్టీకి క్షేత్రస్థాయి నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతోందని బీజేపీ వర్గాలు వెల్లడించాయి.

195 మంది అభ్యర్థుల పేర్లతో మార్చి 2న విడుదల చేసిన తొలి జాబితా విడుదల చేసిన సంగతి తెలిసిందే. నిన్న విడుదల చేసిన రెండో జాబితాలో మాత్రం 30 మంది ఎంపీలకు స్థానం దక్కలేదు. ఇప్పటివరకు ఖరారు చేసిన 267 మందిలో 140 మంది సిట్టింగులు చోటు సంపాదించగా, 67 మంది చోటు దక్కించుకోలేకపోయారు. ప్రగ్యా ఠాకూర్, రమేష్ బిధూరి, పర్వేష్ వర్మ, ప్రీతమ్ ముండే తదితరులకు చుక్కెదురైంది.

Also Read: మిత్రదేశంగా ఉండే మాల్దీవులు ఇప్పుడు భారత వ్యతిరేక కూటమిలో భాగస్వామిగా..

రెండో జాబితాలో మహారాష్ట్ర 20, కర్ణాటక 20 మంది, గుజరాత్‌ 7, తెలంగాణ 6, హర్యానా 6 మధ్యప్రదేశ్‌ 5, ఢిల్లీ 2, ఉత్తరాఖండ్ 2‌, హిమాచల్‌ప్రదేశ్‌ 2 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. దాద్రా, నగర్‌ హవేలీ నుంచి ఒక్కొక్కరి పేర్లను ఖరారు చేశారు. ఢిల్లీలోని ఏగుడురు ఎంపీల్లో ఆరుగురు సిట్టింగులకు టికెట్లు దక్కలేదు. మనోజ్ తివారీ ఒక్కరే తిరిగి సీటు దక్కించుకున్నారు. కాగా, పెండింగ్ లో స్థానాల్లో ఎంత మంది సిట్టింగ్ ఎంపీలు టికెట్లు దక్కించుకుంటారో వేచి చూడాలి.

Also Read: 9 లోక్‌సభ స్థానాల్లో పోటీచేసే అభ్యర్థుల పేర్లను ఖరారు చేసిన కేసీఆర్.. నిజామాబాద్ నుంచి బాజిరెడ్డి