మమతకి ప్రస్ట్రేషన్ పెరిగింది.. బెంగాల్ లో 200కి పైగా స్థానాల్లో బీజేపీ విజయం ఖాయం
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 200కి పైగా స్థానాల్లో విజయం సాధిస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ తెలిపారు.

Bjp Wave Blowing Across Bengal Will Win Over 200 Seats Says Pm Modi At Election Rally
BJP wave blowing across Bengal, will win over 200 seats, says PM Modi at election rally పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 200కి పైగా స్థానాల్లో విజయం సాధిస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ తెలిపారు. గురువారం(ఏప్రిల్-1,2021)సౌత్ 24పరగణాస్ జిల్లాలోని జయ్ నగర్ లో ఎన్నికల ప్రచారంలో ప్రధాని పాల్గొన్నారు.
జయ్ నగర్ ఎన్నికల ప్రచారంలో మోడీ మాట్లాడుతూ..కొన్ని వారాల క్రితం బెంగాల్లో బీజేపీకి 200 సీట్లు వస్తాయని ప్రజలు అన్నారు. అయితే తొలి దశ ఎన్నికల్లో బీజేపీకి మంచి స్టార్ట్ రావడంతో ప్రజల గొంతుకు దేవుడి ఆశీస్సులు లభించినట్లు సృష్టమవుతోంది. బీజేపీకి 200కి పైగా సీట్లు వస్తాయి. ఇవాళ రెండవ దశ పోలింగ్ జరుగుతోంది. పోలింగ్ బూత్కు భారీ సంఖ్యలో ఓటర్లు వస్తున్నారు. ఎక్కడ చూసినా బీజేపీ హవా ఉంది బెంగాల్లో బీజేపీ ప్రభంజనం ఉంది. కూల్ కూల్ అని ఎన్నికల ప్రచారంలో మమత మాట్లాడటం నేను వింటున్నాను. దీదీ, తృణమూల్ కూల్గా లేదు. తృణముల్ శూలంగా మారింది ఆ శూలం వల్ల బెంగాల్ ప్రజలు విపరీతగా బాధపడుతున్నారi మమతాబెనర్జీకి విజన్(దూరదృష్టి)లేదు.
జై శ్రీ రామ్ నినాదాలతో మమతా బెనర్జీ ఇబ్బందిపడుతోంది. మొత్తం బెంగాల్ కి ఈ విషయం తెలుసు. దుర్గామాత ప్రతిమలను నిమజ్జనం చేసినా మమతకి సమస్యే. బెంగాల్ ప్రజలకు ఇది కూడా తెలుసు. ఇప్పుడు, తిలకం దిద్దుకున్నా, కాషాయ వస్త్రాలను చూసినా మమతకి సమస్యగా మారింది. దీదీ మనుషులు ఇప్పుడు ప్రజలను రాక్షసులుగా పిలుస్తున్నారు.
దీదీ, మీరు ఎవరినైనా ప్రసన్నం చేసుకోవాలనుకుంటే, మీకు అలా చేసే ప్రతి హక్కు ఉంది. మీరు నన్ను తిట్టాలనుకుంటే..తిడుతూ ఉండండి. కానీ ప్రజల భక్తిని, రామ్ కృష్ణ పరమహంస, చైతన్య మహాప్రభు, మరియు స్వామి వివేకానంద యొక్క గుర్తింపును తిట్టడానికి నేను మిమ్మల్ని అనుమతించను. బెంగాల్ కుమార్తె సోవా మజుందర్ జికి నా నివాళి అర్పించాలనుకుంటున్నాను. ఆమె బెంగాల్ తల్లులు మరియు సోదరీమణుల ప్రతినిధి. ఈమెని టీఎంసీ మనుషులు హింసించారు.
మొదటి దశ పోలింగ్ తర్వాత దీదీ ఫ్రస్ట్రేషన్ పెరిగింది. సహాయం కోసం ఆమె దేశంలోని పలువురు నాయకులకు ఒక లేఖ రాసింది. బయటి వ్యక్తులు మరియు పర్యాటకులుగా భావించే వారి నుండి దీదీ మద్దతు కోరింది మరియు సమావేశానికి సమయం ఇవ్వలేదు. కొద్ది రోజుల క్రితం నేను బంగ్లాదేశ్ సందర్శించాను. అక్కడ నేను జెషోరేశ్వరి ఆలయంలో ప్రార్థనలు చేశాను. దీదీ దానిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒరకాండిలో, హరిచంద్ ఠాకూర్ & గురుచంద్ ఠాకూర్ యొక్క పవిత్ర భూమిని సందర్శించినప్పుడు నేను దేశానికి ఆశీర్వాదం కోరుకున్నాను. కానీ మమతకు చాలా కోపం వచ్చింది. ఆలయాన్ని సందర్శించడం తప్పా?అని మోడీ ప్రశ్నించారు. తన బంగ్లాదేశ్ పర్యటనపై తృణమూల్ కాంగ్రెస్ అభ్యంతరాలపై మోడీ స్పందిస్తూ.. కాలానుగుణంగా దేవాలయాల పట్ల భక్తి చూపించే వ్యక్తిని తాను కాదని అన్నారు. మన విశ్వాసం మరియు సాంప్రదాయం గురించి తాను ఎప్పుడూ గర్వపడతానని ప్రధాని అన్నారు.