Assembly polls : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ ముందస్తు సన్నాహాలు…బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటి నేడు

దేశంలో ఐదేళ్ల పదవీ కాలపరిమితి ముగియనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ ముందస్తు సన్నాహాలు ప్రారంభించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ కేంద్ర కమిటీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర ఎన్నికల ప్యానల్ సభ్యులతో కూడిన కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం బుధవారం ఢిల్లీలో జరగనుంది.....

Assembly polls : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ ముందస్తు సన్నాహాలు…బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటి నేడు

PM To Chair Key Meet

Updated On : August 16, 2023 / 11:28 AM IST

Assembly polls : దేశంలో ఐదేళ్ల పదవీ కాలపరిమితి ముగియనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ ముందస్తు సన్నాహాలు ప్రారంభించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ కేంద్ర కమిటీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర ఎన్నికల ప్యానల్ సభ్యులతో కూడిన కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం బుధవారం ఢిల్లీలో జరగనుంది. (BJPs Advance Prep) ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేయడానికి, ఎన్నికల వ్యూహాలను రూపొందించడానికి బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ అత్యున్నత నిర్ణయాధికార సంస్థ సమావేశం కానుంది. (PM To Chair Key Meet Today) ఈ సంవత్సరం ప్రారంభంలో కర్ణాటక ఎన్నికలలో ఘోర పరాజయం తర్వాత, వచ్చే ఐదు రాష్ట్రాల ఎన్నికల కోసం బీజేపీ పకడ్బందీ పథకాన్ని రూపొందించాలని యోచిస్తోంది. (5 State Polls ) ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి గట్టి సవాలు ఎదురుకానుంది.

Arvind Kejriwal : కేజ్రీవాల్‌కు ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు

మిజోరం, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ. వీటిలో ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆయా రాష్ట్రాలు ప్రతిపక్షాల పాలిత రాష్ట్రాలు కావడంతో ఈసారి విజయం కోసం బీజేపీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవల లోక్‌సభలో జరిగిన అవిశ్వాస తీర్మానంలో మిజోరం అధికార పార్టీ ఎంఎన్‌ఎఫ్ మిత్రపక్షమైన బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేసింది. కూటమిలో విభేదాలను ఎత్తిచూపుతూ మణిపూర్‌లో బీజేపీ వ్యవహరిస్తున్న తీరును ఆ పార్టీ విమర్శించింది.

Seema Haider : సచిన్‌ను ‘లప్పు సా’ అన్నందుకు సీమా హైదర్ హెచ్చరిక

ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్‌లో కూడా కాంగ్రెస్ పార్టీతో హోరాహోరీ పోరు సాగుతున్నట్లు కనిపిస్తోంది. వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలకు ముందు వచ్చే ఈ అసెంబ్లీ ఎన్నికలు ముఖ్యమైనవని బీజేపీ భావిస్తోంది. బీజేపీ బలహీనంగా ఉన్న స్థానాలపై కేంద్ర కమిటీ భేటీలో ప్రధానంగా చర్చ జరుగుతుందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.

Rudraprayag Bridge collapse : భారీవర్షాలు..కూలిపోయిన రుద్రప్రయాగ్ వంతెన

ఈ సీట్లలో అభ్యర్థులను ముందుగానే గుర్తించాలని, తద్వారా వారికి సన్నద్ధమయ్యేందుకు తగినంత సమయం లభిస్తుందని బీజేపీ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో ఐదు రాష్ట్రాల్లోని కీలక ఎన్నికల అంశాలు, కాంగ్రెస్ వాగ్దానాలను ఎలా ఎదుర్కోవాలనే దానిపై కూడా చర్చిస్తారని బీజేపీ వర్గాలు తెలిపాయి.