Building Collapse : కుప్పకూలిన మూడంతస్తుల భవనం.. ముగ్గురు మృతి, కొనసాగుతున్న సహాయక చర్యలు

యూపీలోని మీరట్ లో విషాద ఘటన చోటు చేసుకుంది. మూడు అంతస్తుల భవనం కూలిపోయిన ఘటనలో ముగ్గురు మృతిచెందగా.. మరికొందరు శిథిలాల కింద చిక్కుకున్నారు.

Building Collapse : కుప్పకూలిన మూడంతస్తుల భవనం.. ముగ్గురు మృతి, కొనసాగుతున్న సహాయక చర్యలు

building collapses

Updated On : September 15, 2024 / 7:25 AM IST

Meerut building collapse : యూపీలోని మీరట్ లో విషాద ఘటన చోటు చేసుకుంది. మూడు అంతస్తుల భవనం కూలిపోయిన ఘటనలో ముగ్గురు మృతిచెందగా.. మరికొందరు శిథిలాల కింద చిక్కుకున్నారు. మీరట్ జిల్లా కేంద్రంలోని జనసాంద్రత అధికంగా ఉండే జాకీర్ కాలనీలో శనివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకోగా.. సమాచారం అందుకున్న నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్), స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్డీఆర్ఎఫ్) బృందాలు సంఘటనా స్థలంకు చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించాయి. ఆ ప్రాంతంలో వర్షం పడుతున్నా సహాయక చర్యలు కొనసాగించి పలువురిని కాపాడారు. అయితే, ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా.. మరో ఆరుగురు శిథిలాల కింద చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. వారిని రక్షించేందుకు శిథిలాల తొలగింపు ప్రక్రియను కొనసాగిస్తున్నారు.

Also Read : Mohammed Shami : అయ్యో పాపం.. ఎయిర్ పోర్టులో చిక్కుకుపోయిన ష‌మీ.. స్పందించిన బాలీవుడ్ న‌టుడు సోనూసూద్‌

ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ దీపక్ మీనా మాట్లాడుతూ.. ఈ ప్రమాదం జరిగిన సమయంలో 14మంది శిథిలాల కింద చిక్కుకున్నారని తెలిపారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టడంతో శిథిలాల కింద చిక్కుకున్న ఎనిమిది మంది రెస్క్యూ బృందాలు సురక్షితంగా బయటకు తీసుకొచ్చాయని అన్నారు. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. మరో ఆరుగురి కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయని దీపక్ మీనా చెప్పారు.