భారత్ లో 73కు చేరిన కరోనా కొత్త స్ట్రెయిన్ కేసులు..యూకే నుంచి వచ్చిన బాధితుల్లో గుర్తింపు

Corona new strain cases reaching 73 in India : కరోనా నుంచి కోలుకోకముందే భారత్ ను కరోనా కొత్త స్ట్రెయిన్ వణికిస్తోంది. భారత్ లో కరోనా కొత్త స్ట్రెయిన్ కేసులు పెరుగుతున్నాయి. దేశంలో కరోనా కొత్త స్ట్రెయిన్ కేసుల సంఖ్య 73కు చేరింది. యూకే నుంచి వచ్చిన బాధితుల్లో కొత్త స్ట్రెయిన్ గుర్తించారు. బాధితులకు ప్రత్యేక వార్డుల్లో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. స్ట్రెయిన్ సోకిన వారి కాంటాక్ట్స్ ను గుర్తించే పనిలో ప్రభుత్వాలు పడ్డాయి.
బాధితులందరూ..ఆయా రాష్ట్రప్రభుత్వాలు ఆరోగ్య సౌకర్యాలు కల్పించిన సింగిల్ రూమ్ ఐసొలేషన్ లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరందరూ బ్రిటన్ నుంచి భారత్ కు ఇటీవల వచ్చినవారే. అంతేకాకుండా వైరస్ సోకినవారితో గడిచిని కొద్దిరోజులుగా సన్నిహితంగా మెలిగినవారిని కూడా క్వారంటైన్ లో ఉంచడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా, వారితో కలిసి ప్రయాణించినవాళ్లను, కుటుంబసభ్యులను మరియు ఇతరుల కోసం కాంటాక్ట్ ట్రేసింగ్ మెదలుపెట్టినట్లు తెలిపారు.
బ్రిటన్ లో వెలుగులోకి వచ్చిన కొత్తరకం కరోనా ఇప్పటికే నెదరాండ్ల్స్, ఆస్ట్రియా, ఇటలీ, సింగపూర్, జపాన్, లెబనాన్, జర్మనీ, స్విట్జర్లాండ్, స్పెయిన్, ఫ్రాన్స్, కెనడా, స్వీడన్ దేశాల్లోకి ప్రవేశించింది.యూకేలో సహా యూరప్ లోని పలు దేశాల్లో కొత్త రకం కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. కొత్త రకం కరోనా నేపథ్యంలో పలు యూరప్ దేశాలు మరోసారి లాక్ డౌన్ ను విధించాయి. కొత్త రకం కరోనా వైరస్..పాత దానికన్నా 70శాతం వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు శాస్త్రవేత్తలు సృష్టం చేసిన విషయం తెలిసిందే.