ఓటర్ల జాబితా సవరణకు కొత్త షెడ్యూల్

ఓటర్ల జాబితా సవరణకు కేంద్ర ఎన్నికల సంఘం కొత్త షెడ్యూల్ను విడుదల చేసింది. 2020 జనవరి 1వ తేదీ నాటికి 18 ఏళ్ల పూర్తయ్యే వారందరూ ఓటు హక్కుకు అర్హులై తమ పేర్లు జాబితాలో నమోదు చేయించుకోవచ్చు. ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ఈ క్రింది విధంగా ఉంది.
ఓటర్ల వివరాల పరిశీలన, పోలింగ్ స్టేషన్ల హేతుబద్దీకరణకు 2019 నవంబర్ 30 తుది గడువుగా తెలిపారు. డిసెంబర్ 16న ఓటర్ల జాబితా మూసాయిదా ప్రచురిస్తారు. ఆ ముసాయిదాలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే వాటికి సంబంధించిన వినతులను జనవరి15,2020 లోగా స్వీకరిస్తారు.
జనవరి 27 సమస్యల పరిష్కారానికి తుది గడువు విధించారు.అనంతరం ఫిబ్రవరి 4వ తేదీనాటికి ఓటర్ల జాబితా అనుబంధాల తయారీ పూర్తిచేస్తారు. తిరిగి ఫిబ్రవరి 7న ఓటర్ల తుది జాబితాల ప్రకటిస్తారు. ఓటుహక్కు నమోదుకు జనవరి 15 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ఈసీ కల్పించింది.