Road Accident 5 Died : ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

ఉత్తరప్రదేశ్ లో లఖింపూర్ ఖేరీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు.

Road Accident 5 Died : ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

road accident

Updated On : January 29, 2023 / 11:41 AM IST

Road Accident 5 Died : ఉత్తరప్రదేశ్ లో లఖింపూర్ ఖేరీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లఖీంపూర్ ఖేరీలోని గోలా బెహ్రైచ్ జాతీయ రహదారిపై స్కూటీని కారు ఢీకొట్టింది. ప్రమాదం ధాటికి కారులో స్కూటీ ఇరుక్కుపోయింది. దీంతో రెండు వాహనాలను వేరు చేయడానికి పాదాచారులు ప్రయత్నిస్తున్నారు.

ఈ క్రమంలో వేగంగా దూసుకొచ్చిన ఓ ట్రక్కు పాదాచారులను బలంగా ఢీకొట్టింది. దీంతో ఐదుగురు మృతి చెందారు. మరి కొందరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

Road Accident Four Killed : ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. కారు, లారీ ఢీకొని నలుగురు మృతి

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు. కాగా, ప్రమాద ఘటనపై యూపీ మాజీ సీఎం, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ నెల 23న ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్ లో జరిగిన ప్రమాదంలో తల్లీకూతురు సహా ఆరుగురు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. లక్నో-కాన్పూర్ హైవేపై ఆజాద్ మార్గ్ క్రాసింగ్ దగ్గర ఓ ట్రక్కు అదుపు తప్పింది. రోడ్డుపై వెళ్తున్న పలు వాహనాలను ఢీకొట్టింది. అనంతరం రోడ్డు పక్కనున్న వారిపైకి దూసూకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో తల్లి, కూతురు ఉన్నారు.