Railway Stations దేశంలోని 6వేల రైల్వే స్టేషన్లలో ఉచిత వై-ఫై
ఇండియన్ రైల్వే మరో మైలురాయిని అందుకుంది. డిజిటల్ ఇండియాలో భాగంగా ఏర్పాటు చేస్తున్న ఉచిత వై-ఫై సేవలు ఇప్పటి వరకు 6 వేల స్టేషన్లకు విస్తరించాయి.
railways ఇండియన్ రైల్వే మరో మైలురాయిని అందుకుంది. డిజిటల్ ఇండియాలో భాగంగా ఏర్పాటు చేస్తున్న ఉచిత వై-ఫై సేవలు ఇప్పటి వరకు 6 వేల స్టేషన్లకు విస్తరించాయి. శనివారం జార్ఖండ్ రాష్ట్రంలోని హజారిబాగ్ టౌన్ రైల్వే స్టేషన్ లో ఉచిత వై-ఫై సౌకర్యం కల్పించడం ద్వారా.. 6 వేల స్టేషన్లలో ఉచిత వై-ఫై సేవలు అందిస్తున్నట్లు భారతీయ రైల్వే తెలిపింది.
2016లో ముంబై రైల్వే స్టేషన్లో మొట్ట మొదట ఉచిత వై-ఫై సదుపాయాన్ని కల్పించారు. పశ్చిమ బెంగాల్లోని మిదాన్పూర్ స్టేషన్లలో ఉచిత వై-ఫై సేవలు అందించి 5,000 మార్కును అందుకుంది. శనివారం జార్ఖండ్లోని హజారిబాగ్ రైల్వే స్టేషన్ లో ఉచిత వై-ఫై సేవలు అందించి 6,000 మార్కును అందుకుంది. అదేవిధంగా, శనివారం ఒడిశాలోని అంగుల్ జిల్లాలోని జరపాడ స్టేషన్కు కూడా వై-ఫై సౌకర్యం కల్పించినట్లు రైల్వే శాఖ ఆదివారం తెలిపింది.
డిజిటల్ ఇండియాలో కార్యక్రమం కింద దేశంలోని రైల్వే స్టేషన్లలో ఉచిత వై-ఫై సౌకర్యం కల్పిస్తున్నారు. దీని వల్ల గ్రామీణ పట్టణ పౌరుల మధ్య డిజిటల్ అంతరం తగ్గుతుంది. తద్వారా గ్రామాల్లో డిజిటల్ మీద అవగాహన పెరుగుతుంది అని అని రైల్వే శాఖ తెలిపింది. ఇండియన్ రైల్వే స్ ఇప్పుడు 6,000 స్టేషన్లలో వై-ఫై సౌకర్యాన్ని అందిస్తున్నట్లు తెలిపింది. రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని పీఎస్యు రైల్టెల్ సహాయంతో రైల్వేలకు ఎటువంటి ఖర్చు లేకుండా స్టేషన్లలో వై-ఫై సౌకర్యాలు కల్పిస్తున్నారు. గూగుల్, డాట్(యుఎస్ఓఎఫ్ కింద), పీజిసీఐఎల్, టాటా ట్రస్ట్ భాగస్వామ్యంతో ఈ పని చేపట్టారు.