తేజస్ ఎక్స్ప్రెస్ సేవలు నిలిపివేత

IRCTC Halts Tejas Express తేజస్ ఎక్స్ప్రెస్ రైలు సేవలను తాత్కాలికంగా రద్దు చేసింది రైల్వే శాఖ. కరోనా నేపథ్యంలో లఖ్నవూ-ఢిల్లీ, అహ్మదాబాద్-ముంబై మధ్య నడిచే తేజస్ రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది.
ఐఆర్సీటీసీ పర్యవేక్షణలో నడిచే ఈ తేజస్ ఎక్స్ప్రెస్ సర్వీసులు.. లాక్డౌన్ అనంతరం అక్టోబర్ 17న తిరిగి ప్రారంభమయ్యాయి. అయితే.. మహమ్మారి భయాల నేపథ్యంలో ప్రయాణికులు వీటిపై పెద్దగా ఆసక్తి చూపట్లేదు. ఫలితంగా.. వ్యయంతో కూడుకున్న ఈ ట్రైన్ల నిర్వహణ కష్టంగా మారింది.