Maha Kumbh mela: మహా కుంభమేళా.. పవిత్ర త్రివేణి సంగమంలో నాగసాధువులు ‘అమృత స్నానం’.. పోటెత్తిన భక్తజనం
Maha Kumbh mela: ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో ప్రపంచంలోనే అతిపెద్ద అధ్యాత్మిక వేడుక మహాకుంభ మేళా రెండో రోజు కొనసాగుతుంది. మకర సంక్రాంతి సందర్భంగా భక్తులు, నాగసాధువులు అమృత స్నానాలు ఆచరిస్తున్నారు.

Maha Kumbh Mela 2025
Maha Kumbh mela: ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో ప్రపంచంలోనే అతిపెద్ద అధ్యాత్మిక వేడుక మహాకుంభ మేళా సోమవారం ఉదయం పుష్య పూర్ణిమ స్నానంతో మొదలైంది. పన్నెండేళ్లకు ఒకసారి జరిగే ఈ కుంభమేళా 45 రోజులు పాటు కొనసాగనుంది. తొలిరోజు సాయంత్రం 6గంటల వరకు 1.65కోట్ల మంది భక్తులు త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించినట్లు యూపీ ప్రభుత్వం పేర్కొంది. అయితే, కుంభమేళాలో రెండోరోజు అమృత స్నానం కోసం భక్తులు పోటెత్తారు.
కుంభమేళాలో మొదటి అమృత స్నానం మకర సంక్రాంతి శుభసందర్భంగా జరగనుంది. ఇందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. దీంతో తెల్లవారు జామునుంచే గంగా, యమున, అంతర్వాహినిగా భావించే సరస్వతి నదుల త్రివేణి సంగమంలో సనాతన ధర్మంలోని 13 అఖాడాలకు చెందిన సాధువులు, రుషులు ఇవాళ పవిత్ర స్నానం ఆచరిస్తున్నారు. సనాతన ధర్మంలోని 13 అఖాడాల క్రమాన్ని మహా కుంభమేళా పరిపాలన విభాగం ఖరారు చేసింది. ప్రతి అఖాడాకు పవిత్ర స్నానాలు ఆచరించేందుకు సమయాన్ని షెడ్యూల్ చేశారు.
#WATCH | Prayagraj, Uttar Pradesh | Spiritual leader Swami Kailashanand Giri leads the processions for the first Amrit Snan of #MahaKumbh2025 on the auspicious occasion of Makar Sankranti.
Sadhus of the 13 akhadas of Sanatan Dharm will take holy dip at Triveni Sangam – a sacred… pic.twitter.com/tFIpDCOK5P
— ANI (@ANI) January 14, 2025
శ్రీ పంచాయతీ అఖరా మహానిర్వాణి, శ్రీ శంభు పంచాయతీ అటల్ అఖారా తొలుత అమృత స్నానం చేశారు. రెండు అఖరాలు ఉదయం 5.15 గంటలకు శిబిరం నుంచి బయలుదేరి 6.15గంటలకు ఘాట్ వద్దకు చేరుకున్నారు. 40 నిమిషాల పాటు వీరు పవిత్ర స్నానాలు చేశారు. అనంతరం 6.55 గంటలకు ఘాట్ నుంచి బయలుదేరి వెళ్లిపోయారు. ఆ తరువాత శ్రీ తపోనిధి పంచాయతీ, శ్రీ నిరంజని అఖారా మరియు శ్రీ పంచాయతీ అఖారా ఆనంద్ ఉదయం 7.05 గంటలకు ఘాట్ వద్దకు చేరుకున్నారు. రెండు అఖారాలకు చెందిన నాగ సాధువులు 40 నిమిషాల పాటు పవిత్ర సంగమంలో అమృత స్నానం చేశారు. ఇలా.. వారికి కేటాయించిన సమయం ప్రకారం అఖారాలు ఘాట్ వద్దకు చేరుకొని పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు.
यह हमारी सनातन संस्कृति और आस्था का जीवंत स्वरूप है।
आज लोक आस्था के महापर्व ‘मकर संक्रांति’ के पावन अवसर पर महाकुम्भ-2025, प्रयागराज में त्रिवेणी संगम में प्रथम ‘अमृत स्नान’ कर पुण्य अर्जित करने वाले सभी श्रद्धालु जनों का अभिनंदन!#महाकुम्भ_अमृत_स्नान pic.twitter.com/NAN0IlkGf4
— Yogi Adityanath (@myogiadityanath) January 14, 2025
యూపీ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్ ట్విటర్ ఖాతాలో మహాకుంభ మేళాలో మంగళవారం తెల్లవారు జామున తీసిన కొన్ని ఫొటోలను షేర్ చేశారు. ఇది మన సనాతన సంస్కృతి మరియు విశ్వాసానికి సజీవ రూపం అని రాశారు. మకర సంక్రాంతి సందర్భంగా మహాకుంభ మేళాలో ప్రయాగ్ రాజ్ లోని త్రివేణి సంగమం వద్ద మొదటి అమృత స్నానం ఆచరించి పుణ్యం పొందిన భక్తులందరికీ అభినందనలు తెలిపారు.
यह हमारी सनातन संस्कृति और आस्था का जीवंत स्वरूप है।
आज लोक आस्था के महापर्व ‘मकर संक्रांति’ के पावन अवसर पर महाकुम्भ-2025, प्रयागराज में त्रिवेणी संगम में प्रथम ‘अमृत स्नान’ कर पुण्य अर्जित करने वाले सभी श्रद्धालु जनों का अभिनंदन!#महाकुम्भ_अमृत_स्नान pic.twitter.com/NAN0IlkGf4
— Yogi Adityanath (@myogiadityanath) January 14, 2025