ముంబైలో ప్రత్యక్షమైన మోనోలిత్

ముంబైలో ప్రత్యక్షమైన మోనోలిత్

Updated On : March 10, 2021 / 9:39 PM IST

mumbai మోనోలిత్ (ఏకశిల విగ్రహం)..కొద్ది నెలలుగా ప్రపంచవ్యాప్తంగా ఇదే వార్త. రోజుకో చోట ప్రత్యక్షమవుతున్న ఈ లోహ స్తంభం.. మేథావులకు సైతం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇది ఎవరైనా కావాలని చేస్తున్న పనా? లేదా.. ఏలియన్స్ సంకేతమా అనేది అర్థం కాక అంతా జుట్టు పీక్కుంటున్నారు.

అయితే,తాజాగా ముంబైలో మోనోలిత్ ప్రత్యక్షమైంది. బుధవారం బంద్రా జాగర్స్ పార్క్ మధ్యలో మోనోలీత్ ప్రత్యక్షమైంది. బంద్రా కార్పొరేటర్ ఆశిఫ్ జకారియా ఆ ఫోటోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. అద్దంలా మెరిసిపోతున్న ఈ లోహపు స్తంభం మీద ఏవో నెంబర్లు చెక్కి ఉన్నాయని ఆయన తెలిపారు. వాటికి అర్థం ఏమిటో తమకు తెలీదన్నారు. కాగా, ఇటీవల అహ్మదాబాద్‌లో సైతం మోనోలిత్ ప్రత్యక్షమైన విషయం తెలిసిందే. అయితే అహ్మదాబాద్ లో మోనోలిత్ ను ఓ ఆర్కిటెక్ట్ ఏర్పాటు చేశాడని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే, ఇప్పుబు ముంబైలో ప్రత్యక్షమైన మరో మోనోలిత్ ఎవరు ఏర్పాటు చేశారనే విషయమే ఇంకా మిస్టరీగా ఉంది.

మరోవైపు, ఆదివారం (డిసెంబరు 6) ఒకేసారి రెండు దేశాల్లో ఈ మోనోలిత్‌లు ప్రత్యక్షమయ్యాయి. వీటిలో ఒకటి ఇంగ్లాండ్‌లోని ఐల్ ఆఫ్ వైట్‌లో ప్రత్యక్షం కాగా.. మరొకటి ఫ్రైస్‌ల్యాండ్‌లో కనిపించింది. ఇవి రెండు.. మొదటిసారిగా అమెరికాలోని ఉటా రెడ్ రాక్ ఎడారిలో కనిపించిన మోనోలిత్ తరహాలోనే ఉండటం గమనార్హం.

మొదటగా ఈ మోనోలిత్… అమెరికాలోని ఉటా రెడ్ రాక్ ఎడారిలో కనిపించింది. ఉటా డిపార్ట్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ అండ్ డివిజన్ ఆఫ్ వైల్డ్ లైఫ్ రిసోర్సెస్‌కు చెందిన సిబ్బంది హెలికాప్టర్‌లో వెళ్తుండగా.. ఎడారిలో ఏదో వస్తువు మెరుస్తూ కనిపించింది. దాని వద్దకు వెళ్లి పరిశీలించగా.. త్రికోణంలో ఉన్న ఎత్తైన స్తంభం కనిపించింది. అయితే, అది ఎవరు ఎప్పుడు ఎలా ఏర్పాటు చేశారనే విషయంపై అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చేస్తున్నారు. కనీసం రవాణా సదుపాయం కూడా లేని ఆ ప్రాంతంలోకి అంత బరువైన స్తంభాన్ని ఎలా తెచ్చారనేది అప్పట్లో మిస్టరీగా మారింది. ఎంతో నునుపుగా.. మెరుస్తున్న ఈ మోనోలిత్‌ను తర్వాతి రోజు కొంతమంది వ్యక్తులు అక్కడి దాన్ని తొలగించారు. దీంతో.. దాన్ని ఎవరో కావాలనే ఏర్పాటు చేసి ఉంటారని భావించారు. ఆ తర్వాత ఇలాంటి స్తంభం కాలిఫోర్నియా, రోమానియాలో ప్రత్యక్షమవడమే కాకుండా భారత్ తో సహా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ప్రత్యక్షమైంది.