Parliament : ఢిల్లీ సర్వీసెస్ ఆర్డినెన్స్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం

అయితే విపక్షాలు డివిజన్ కు పట్టుబట్టడంతో రెండో సారి ఓటింగ్ నిర్వహించారు. ఓటింగ్ సమయంలో టెక్నికల్ సమస్య తలెత్తడంతో రాజ్యసభ సభ్యులు స్లిప్ ల ద్వారా ఓటు వేశారు. ఇక ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి ఆమోదం కోసం పంపనుంది.

Parliament : ఢిల్లీ సర్వీసెస్ ఆర్డినెన్స్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం

Parliament Delhi Services Ordinance Bill

Updated On : August 8, 2023 / 8:54 AM IST

Parliament Delhi Services Ordinance Bill : ఢిల్లీ సర్వీసెస్ ఆర్డినెన్స్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. విపక్షాల అభ్యంతరాల మధ్య బిల్లుకు పార్లమెంట్ ఆమోద ముద్ర వేసింది. రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెట్టిన ఢిల్లీ అధికారుల నియంత్రణ బిల్లుపై చర్చ అనంతరం పెద్దల సభ పచ్చ జెండా ఊపింది. ఢిల్లీ సర్వీసుల బిల్లుకు అనుకూలంగా 131 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 102 ఓట్లు వచ్చాయి. మొదట మూజువాణీ ఓటుతో బిల్లుకు ఆమోదం తెలిపారు.

అయితే విపక్షాలు డివిజన్ కు పట్టుబట్టడంతో రెండో సారి ఓటింగ్ నిర్వహించారు. ఓటింగ్ సమయంలో టెక్నికల్ సమస్య తలెత్తడంతో రాజ్యసభ సభ్యులు స్లిప్ ల ద్వారా ఓటు వేశారు. ఇక ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి ఆమోదం కోసం పంపనుంది. రాష్ట్రపతి ఆమోదిస్తే ఈ బిల్లు చట్టంగా మారనుంది. బిల్లుకు మద్దతుగా వైసీపీ, టీడీపీ, బీజేడీ, బీఎస్పీతోపాటు ఎన్డీఏ మిత్రపక్షాలు ఓటు వేశాయి.

No Confidence Motion : మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానంపై నేడు పార్లమెంట్ లో చర్చ

మొదటి నుంచి బిల్లును వ్యతిరేకిస్తున్న బీఆర్ఎస్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసింది. అంతకముందు బిల్లును సభలో ప్రవేశపెట్టిన కేంద్రమంత్రి అమిత్ షా కేంద్రం తీసుకొచ్చిన ఢిల్లీ సర్వీసెస్ బిల్లు సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించ లేదని అన్నారు. దేశ రాజధానిలో సమర్థవంతమైన అవినీతి రహిత పాలనను అందించాలనే లక్ష్యంతోనే ఈ బిల్లును తీసుకొచ్చినట్లు తెలిపారు.

కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే ఈ బిల్లును తొలిసారి తీసుకొచ్చారని గుర్తు చేశారు. కాంగ్రెస్ హయాంలో తీసుకొచ్చిన ఈ బిల్లులోని ఏ ఒక్క నిబంధనను కూడా మార్చలేదని పేర్కొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీని బుజ్జగించడం కోసమే కాంగ్రెస్ పార్టీ తాను తీసుకొచ్చిన బిల్లును తానే వ్యతిరేకిస్తోందని విమర్శించారు.

Uttarakhand: ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు.. కొడియాల వద్ద చిక్కుకున్న తెలుగు యాత్రికులు

ఢిల్లీ సర్వీసెస్ బిల్లు అప్రజాస్వామికమైందని బీఆర్ఎస్ ఎంపీ కె.కేశవరావు అన్నారు. ఎన్నికైన ప్రభుత్వానికి అధికారులను దూరం చేసేలా ఈ బిల్లు ఉందన్నారు. స్వల్ప మెజారిటీతో బిల్లు ఆమోదం పొందిందని తెలిపారు. బిల్లును వ్యతిరేకించినంత మాత్రాన తాము ఇండియా కూటమిలో భాగం కాదని క్లారిటీ ఇచ్చారు. ఢిల్లీ సర్వీసెస్ బిల్లు దేశాన్ని నాశనం చేస్తుందని చెప్పారు.