PM Modi At UNSC Meeting : పైరసీ, ఉగ్రవాదం కోసం సుముద్ర మార్గాలు దుర్వినియోగమవుతున్నాయ్

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో "సముద్రాల భద్రత బలోపేతం- అంతర్జాతీయ సహకారం"పై సోమవారం వర్చువల్​గా జరిగిన డిబేట్ కి భారత ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు.

PM Modi At UNSC Meeting : పైరసీ, ఉగ్రవాదం కోసం సుముద్ర మార్గాలు దుర్వినియోగమవుతున్నాయ్

Pm Modi (1)

Updated On : August 9, 2021 / 8:28 PM IST

PM Modi At UNSC Meeting  ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో “సముద్రాల భద్రత బలోపేతం- అంతర్జాతీయ సహకారం”పై సోమవారం వర్చువల్​గా జరిగిన డిబేట్ కి భారత ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు. దీంతో ఐరాస భద్రతా మండలిలో చేపట్టిన బహిరంగ చర్చకు అధ్యక్షత వహించిన భారత తొలి ప్రధానిగా మోదీ నిలిచారు. ఈ హై లెవల్ మీటింగ్ లో ఐరాస భద్రత మండలిలోని సభ్య దేశాల అధినేతలు, ఉన్నతస్థాయి అధికారులు, కీలక ప్రాంతీయ సంస్థల ప్రతినిధులు వర్చువల్​ గా హాజరయ్యారు. సముద్ర జలాల్లో నేరాలను సమర్థవంతంగా ఎదుర్కోనేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలి, తీర ప్రాంతాల మధ్య సహకారాన్ని బలోపేతం చేయటంపై ప్రధానంగా ఈ డిబేట్ లో ప్రధానంగా చర్చించారు.

ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ..సముద్రాలు మన భాగస్వామ్య వారసత్వ సంపద అని తెలిపారు. ప్లాస్టిక్​, చమురు లీకేజీలతో ఏర్పడే కాలుష్యం నుంచి సముద్రాలను కాపాడాలని మోదీ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ వాణిజ్యానికి, భూమండల భవిష్యత్తుకు సముద్రాలు చాలా కీలకమన్నారు. సముద్ర వాణిజ్యానికి ఏదైనా ఆటంకం కలిగితే అది గ్లోబల్​​ ఎకానమీపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. మహా సముద్రాలు అనేక రకాల సవాళ్లను ఎదుర్కొంటున్నాయని.. సముద్ర దారులను పైరసీ, ఉగ్రవాదం కోసం దుర్వినియోగం చేస్తున్నారని ఈ సందర్భంగా మోదీ పేర్కొన్నారు. సముద్ర జలాల్లో భద్రతపై ప్రాంతీయ సహకారాన్ని పెంపొందించేందుకు భారత్​ పలు చర్యలు చేపట్టిందని మోదీ తెలిపారు. సముద్ర వాణిజ్యాన్ని పెంపొందించేందుకు చేపట్టే మౌలిక ప్రాజేక్టుల నిర్మాణంలో దేశాల సామర్థ్యం, ఆర్థిక స్థిరత్వాన్ని పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఎస్​ఏజీఆర్​​(భద్రత సహా అన్ని ప్రాంతాల అభివృద్ధి) విజన్​తో తమ ప్రాంతంలో సముద్రాల భద్రతపై ఒక విధానాన్ని రూపొందించాలన్నారు. దీని ద్వారా సముద్రాలు సురక్షితమైనవిగా, భద్రంగా, స్థిరంగా ఉంటాయన్నారు

ఈ సందర్భంగా సముద్ర భద్రత కోసం 5 ప్రాథమిక సూత్రాలను మోదీ ప్రతిపాదించారు. 1. స్వేచ్ఛాయుత సముద్ర వాణిజ్యంలో ఆడ్డంకులను తొలగిస్తే చట్టబద్ధమైన వ్యాపారాన్ని స్థాపించవచ్చన్నారు. 2. వివాదాలు శాంతియుతంగా, అంతర్జాతీయ చట్టాలకు కట్టుబడి పరిష్కరించుకోవాలి. 3. బాధ్యాతాయుతమైన సముద్రాల అనుసంధానాన్ని ప్రోత్సహించాలి. 4. సహజ విపత్తులు, విద్రోహ శక్తుల నుంచి ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు ఉమ్మడిగా పోరాడాలి. 5. సముద్ర పర్యావరణ, వనరులను సంరక్షించాలి.