Narendra Modi: ఎన్డీఏ గెలుపుపై ప్రధాని మోదీ కామెంట్స్
గత దశాబ్దం కాలంగా చేస్తున్న మంచి పనులను కొనసాగిస్తామని..

PM Narendra Modi
దేశంలో ఎన్డీఏ 272 సీట్ల మెజారిటీని దాటడంతో దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. ఎన్డీఏపై ప్రజలు వరుసగా మూడోసారి నమ్మకాన్ని ఉంచారని అన్నారు. భారత చరిత్రలో ఇదో చరిత్రాత్మక అడుగు అని తెలిపారు. ప్రజలకు రుణపడి ఉంటానని చెప్పారు.
గత దశాబ్దం కాలంగా చేస్తున్న మంచి పనులను కొనసాగిస్తామని, ప్రజల కలలను సాకారం చేయడానికి కృషిచేస్తామని ప్రధాని మోదీ తెలిపారు. గెలుపుకోసం కృషి చేసిన తమ కార్యకర్తలకు సెల్యూట్ చేస్తున్నానని చెప్పారు. మాటల్లో చెప్పలేనంత కృషి చేశారని అన్నారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ పట్ల ప్రజల్లో ఉన్న అచంచల విశ్వాసానికి ఈ ఎన్నికల ఫలితాలు అద్దం పడుతున్నాయని కేంద్ర మంత్రి అమిత్ షా చెప్పారు. మోదీ విజన్పై ప్రజల్లో విశ్వాసం ఉందని తెలిపారు. దేశాభివృద్ధి ప్రయాణానికి మరింత బలాన్ని అందించడానికి నవ భారత్ సిద్ధంగా ఉందన్నారు.
ఢిల్లీలోని బీజేపీ ఆఫీసులో మోదీ కామెంట్స్
- కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం
- మన ప్రభుత్వంపై ప్రజలు విశ్వాసం ఉంచారు
- ఇది వికసిత్ భారత్ కు లభించిన విజయం
- ఎన్నికల ప్రక్రియ పై ప్రజలందరికీ విశ్వాసం ఉంది
- 1962 తరువాత వరుసగా ఒక ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి రావడం ఇదే తొలిసారి
- ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం తొలిసారి ఏర్పడుతుంది
- కేరళలో తొలిసారిగా బీజేపీ సీటు గెలిచింది
- తెలంగాణలో రెట్టింపు సంఖ్యలో సీట్లు సాధించాం
- ఏపీలో చంద్రబాబు నాయకత్వంలో, బిహార్ లో నితీశ్ నాయకత్వంలో ఎన్డీఏ అద్భుత ఫలితాలు సాధించింది
Also Read: ముఖ్యమంత్రి పదవికి వైఎస్ జగన్ రాజీనామా