Z-Morh Tunnel: జడ్-మోడ్ సొరంగాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ

మోదీతో పాటు జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా సహా సీఎం ఒమర్‌ అబ్దుల్లా, తదితరులు ఉన్నారు.

Z-Morh Tunnel: జడ్-మోడ్ సొరంగాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ

Updated On : January 13, 2025 / 3:51 PM IST

జమ్మూకశ్మీర్‌ పర్యటనలో ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇవాళ జడ్‌ మోడ్‌ సొరంగాన్ని ప్రారంభించారు. ఈ సొరంగాన్ని గాందర్‌బల్‌ జిల్లాలో నిర్మించారు. టన్నెల్‌ లోపల మోదీ పరిశీలించారు. మోదీతో పాటు జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా సహా సీఎం ఒమర్‌ అబ్దుల్లా, తదితరులు ఉన్నారు.

సొరంగం ప్రత్యేకతలు

  • రూ.2,700 కోట్లతో సొరంగం నిర్మాణం
  • శ్రీనగర్‌ లేహ్‌ జాతీయ రహదారిపై సోన్‌మార్గ్‌ ప్రాంతంలో నిర్మాణం
  • సముద్ర మట్టానికి 8,650 అడుగుల ఎత్తులో నిర్మాణం
  • 6.5 కిలోమీటర్ల పొడవుతో సొరంగం
  • ఈ సొరంగం ద్వారా ఏ కాలంలోనైనా లద్దాఖ్‌ను రహదారి మార్గం ద్వారా చేరుకునే వీలు
  • 2015 మేలో ప్రారంభమైన నిర్మాణ పనులు
  • గత ఏడాది పూర్తయిన పనులు
  • సోన్‌మార్గ్‌కు పర్యాటకుల సందడి పెరిగే అవకాశం
  • లద్దాఖ్‌లో జాతీయ రక్షణ అవసరాలకు వ్యూహాత్మక ప్రాముఖ్యతనిచ్చి సొరంగం నిర్మించారు
  • కనెక్టివిటీని మరింత పెంచేలా నిర్మాణం
  • ప్రయాణ సామర్థ్యాన్ని మెరుగుపర్చనున్న సొరంగం
  • రహదారి కనెక్టివిటీ ప్రమాణాలను మరింత మెరుగుపర్చనున్న నిర్మాణం
  • గగాంగీర్, సోనామార్గ్ మధ్య అంతరాయం లేకుండా ప్రయాణం కొనసాగించవచ్చు

Gangula Kamalakar: సంజయ్‌పై కౌశిక్ రెడ్డి ఆగ్రహానికి కారణం అదే.. గంగుల కమలాకర్ కీలక వ్యాఖ్యలు