Pm Modi: సాయంత్రం 5 గంటలకు జాతినుద్దేశించి ప్రధాని ప్రసంగం
ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం సాయంత్రం 5 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం ట్వీట్ చేసింది.

Pm Modi: ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం సాయంత్రం 5 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం ట్వీట్ చేసింది. ఇక మోదీ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కరోనా కేసులు తగ్గుతున్న నేపథ్యంలో ప్రధాని ప్రసంగం ప్రాధాన్యం సంతరించుకుంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో లాక్ డౌన్ పై ప్రధాని మాట్లాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మరోవైపు థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తుండటంతో దీనిపై కూడా మోదీ స్పందిస్తారని తెలుస్తుంది. దేశంలో కరోనా కేసులు తగ్గడంతో ఆర్ధిక కార్యకలాపాలు పుంజుకున్నాయి. లాక్ డౌన్ నిబంధాల్లో సడలింపు ఇస్తే ఆర్ధిక కార్యకలాపాలు సజావుగా సాగె అవకాశం ఉంది.
Prime Minister Shri @narendramodi will address the nation at 5 PM today, 7th June.
— PMO India (@PMOIndia) June 7, 2021