Anti COVID-19 Drugs : ఆ మందులు ఎక్కడివి.. సోనూసూద్‌కు నోటీసులు

కరోనా సమయంలో సెలెబ్రిటీలు, పొలిటీషియన్లు చేపడుతున్న సహాయ కార్యక్రమాలపై ముంబై హైకోర్టు విచారణ చేపట్టింది. పలువురు సినీ తారలు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు యాంటీ కోవిడ్ డ్రగ్స్ పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. అసలు.. ఆ మందులు వారికి ఎక్కడి నుంచి వస్తున్నాయని ముంబై హైకోర్టు ప్రశ్నించింది. సెలబ్రిటీలకు కోవిడ్ మందులు, ఇంజెక్షన్లు ఎలా వస్తున్నాయో వివరించాలని మహారాష్ట్ర

Anti COVID-19 Drugs : ఆ మందులు ఎక్కడివి.. సోనూసూద్‌కు నోటీసులు

Anti Covid 19 Drugs

Updated On : May 28, 2021 / 1:15 PM IST

Anti COVID-19 Drugs : కరోనా సమయంలో సెలెబ్రిటీలు, పొలిటీషియన్లు చేపడుతున్న సహాయ కార్యక్రమాలపై ముంబై హైకోర్టు విచారణ చేపట్టింది. పలువురు సినీ తారలు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు యాంటీ కోవిడ్ డ్రగ్స్ పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. అసలు.. ఆ మందులు వారికి ఎక్కడి నుంచి వస్తున్నాయని ముంబై హైకోర్టు ప్రశ్నించింది. సెలబ్రిటీలకు కోవిడ్ మందులు, ఇంజెక్షన్లు ఎలా వస్తున్నాయో వివరించాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది ముంబై హైకోర్టు. ఈ సందర్భంగా కోవిడ్ డ్రగ్స్ పై అథారిటీ కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉందని హైకోర్టు గుర్తు చేసింది.



ప్రజలకు మంచి చేయాలన్న వారి ఆలోచన మంచిదే, కానీ కేవలం కేంద్రం ప్రభుత్వానికి మాత్రమే అథారిటీ ఉన్న ఈ కోవిడ్ డ్రగ్స్ వారికి ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకోవాలని ప్రభుత్వానికి చెప్పింది. ఇందులో ఏదైనా బ్లాక్ మార్కెటింగ్ జరుగుతోందా? లేదా అనధికారికంగా మందులు సమకూర్చుకుంటున్నారా? అన్నది విచారణ జరిపి తేల్చాలన్నారు.



దీనిపై ఇప్పటికే ప్రభుత్వం ముంబై కాంగ్రెస్ ఎమ్మెల్యే జీషన్ సిద్దిఖీ, సోనూసూద్ చారిటీ ఫౌండేషన్, ఇతర వ్యక్తులను నోటీసులు జారీ చేసింది. కొందరు ఉత్పత్తి కేంద్రాల నుంచి మందులు కొనుగోలు చేస్తుండగా, మరికొందరు దాతృత్వంతో డొనేట్ చేస్తున్నట్లు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే కేంద్ర ప్రభుత్వానికి తెలియకుండా మందులు వారి దగ్గరికి ఎలా వచ్చాయని కోర్టు ప్రశ్నించింది. రెమ్ డెసివిర్ సంస్థలను తాము ప్రశ్నించామని, వారు ఎవరూ కూడా సెలబ్రిటీలకు డ్రగ్ సరఫరా చేయలేదని కేంద్రం తరుపు న్యాయవాది కోర్టుకి తెలిపారు. ఈ అంశంపై మరింత విచారణ జరపనుంది శివసేన ప్రభుత్వం.