కరోనాతో జ‌ర్న‌లిస్టు మరణిస్తే…రూ. 10లక్షలు పరిహారం

  • Published By: venkaiahnaidu ,Published On : August 25, 2020 / 08:33 PM IST
కరోనాతో జ‌ర్న‌లిస్టు మరణిస్తే…రూ. 10లక్షలు పరిహారం

Updated On : August 25, 2020 / 9:08 PM IST

పంజాబ్ రాష్ట్రంలో కరోనాతో ఎవ‌రైనా జ‌ర్న‌లిస్టు మ‌ర‌ణిస్తే బాధిత కుటుంబానికి రూ. 10 ల‌క్ష‌ల న‌ష్ట‌ప‌రిహారం అంద‌జేయ‌నున్న‌ట్లు సీఎం అమ‌రీంద‌ర్ సింగ్ మంగ‌ళ‌వారం ప్ర‌క‌టించారు.

గుర్తింపుపొందిన‌(అక్రిడేటెడ్‌) జ‌ర్న‌లిస్టుల‌కు ఇది వ‌ర్తించ‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. క‌రోనా వైర‌స్ కార‌ణంగా పాటియాలాకు చెందిన 28ఏళ్ళ జ‌ర్న‌లిస్ట్ మృతిచెందిన మ‌రుస‌టి రోజే సీఎం ఈ నిర్ణ‌యం వెలువ‌రించారు.