Railways Good News : దేశంలో రైల్వే ప్రయాణికులకు శుభవార్త
భారతీయ రైల్వే దేశంలో రైల్వే ప్రయాణికులకు శుభవార్త వెల్లడించింది. రైల్వే టికెట్ల వెయిటింగ్ లిస్టులను లేకుండా చేయడానికి 2027వ సంవత్సరం నాటికి మరో 3వేల అదనపు ప్యాసింజర్ రైళ్లను నడపాలని ఇండియన్ రైల్వే నిర్ణయించింది....
Railways Good News : భారతీయ రైల్వే దేశంలో రైల్వే ప్రయాణికులకు శుభవార్త వెల్లడించింది. రైల్వే టికెట్ల వెయిటింగ్ లిస్టులను లేకుండా చేయడానికి 2027వ సంవత్సరం నాటికి మరో 3వేల అదనపు ప్యాసింజర్ రైళ్లను నడపాలని ఇండియన్ రైల్వే నిర్ణయించింది. 2027 నాటికి భారతీయ రైల్వేశాఖ ప్రయాణీకుల సామర్థ్యాన్ని సంవత్సరానికి 8,00 కోట్ల నుంచి 1,000 కోట్లకు పెంచాలని యోచిస్తోంది.
ALSO READ : Revanth Reddy : హైదరాబాద్ను విశ్వనగరంగా మార్చిన ఘనత కాంగ్రెస్దే- రేవంత్ రెడ్డి
భారతీయ రైల్వే దీపావళి,ఛాత్ పూజ సందర్భంగా ప్రయాణికుల రాకపోకల కోసం 2,423 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. పండుగ సీజనులో బీహార్, ఉత్తరప్రదేశ్, రాష్ట్రాల్లోని రైళ్లలో వెయిటింగ్ లిస్టుల సంఖ్య పెరగడం, రైల్వేస్టేషన్లలో ప్రయాణికులు కిక్కిరిసి ఉండటంతో రైల్వే శాఖ కొత్త నిర్ణయం తీసుకుంది.
ALSO READ : YouTube: యూట్యూబర్లకు పెద్ద న్యూస్.. ఇకపై అలాంటి న్యూడ్ కంటెంట్కు కూడా డబ్బులు వస్తాయి
టిక్కెట్ల కోసం వెయిటింగ్ లిస్ట్లను తొలగించేందుకు వచ్చే ఐదేళ్లలో మరో 3,000 ప్యాసింజర్ రైళ్లను తన నెట్వర్క్లో చేర్చాలని భారతీయ రైల్వే యోచిస్తోంది. మరో 3,000 కొత్త రైళ్లు నడిపితే ప్రయాణికులకు టికెట్ వెయిటింగ్ లిస్టు లేకుండా కన్ ఫర్మ్ చేయవచ్చని రైల్వే అధికారి ఒకరు చెప్పారు. భారతీయ రైల్వే కొవిడ్ పూర్వ కాలంలో రోజుకు నడిపే ప్యాసింజర్ రైళ్ల సంఖ్యను 10,186 నుంచి 10,747కు పెంచింది.
ALSO READ : Vijayashanthi : కాంగ్రెస్ పార్టీలో చేరిన విజయశాంతి
రాబోయే కాలంలో దేశంలో 13,000 ప్యాసింజర్ రైళ్లు నడపాలని భారతీయ రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది. దీంతోపాటు భారతీయ రైల్వే తన ప్యాసింజర్ రైలు కోచ్ వ్యవస్థను కూడా అప్గ్రేడ్ చేయాలని యోచిస్తోంది. పాత కోచ్ వ్యవస్థ స్థానంలో టైన్ సెట్ పేరిట 22 బోగీల సెమీ పర్మినెంట్ కప్లర్స్ టెక్నాలజీతో అతుకులు లేని రైళ్లను ప్రవేశపెట్టనున్నట్లు రైల్వేశాఖ అధికార వర్గాలు వెల్లడించాయి.