ఒక్కరోజులోనే 17వేలకు పైగా కరోనా కేసులు.. రాష్ట్రాలవారీగా లెక్కలు!
దేశంలో కరోనా వైరస్ సోకిన రోగుల సంఖ్య 4.90 లక్షలకు పెరిగింది. కరోనా వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 15వేలు దాటింది. గత 24 గంటల్లో, 17 వేలకు పైగా కరోనా వైరస్ కేసులు కొత్తగా నమోదయ్యాయి. ఇదే సమయంలో 407మంది చనిపోయారు. అయితే దేశంలో వైరస్ నుంచి కోలుకుంటున్న రోగుల సంఖ్య కూడా వేగంగా పెరుగుతోంది. ఇప్పటివరకు 2.85 లక్షల మంది రోగులు పూర్తిగా కోలుకున్నారు.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో కొత్తగా 17,296 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి, 407 మంది చనిపోగా.. దేశంలో మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 4 లక్షల 90 వేల 401కి పెరిగింది. ఇందులో 1 లక్ష 89 వేల 463 క్రియాశీల కేసులు కాగా 2 లక్షల 85 వేల 637 మందికి నయమైంది. దేశంలో ఇప్పటివరకు మొత్తం 15,301 మంది చనిపోయారు.
కరోనా వైరస్ బారిన పడిన మహారాష్ట్ర, ఢిల్లీ మరియు తమిళనాడులలో, సోకిన వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మహారాష్ట్రలో రోగుల సంఖ్య 1.47 లక్షలు దాటింది. అదే సమయంలో, దేశ రాజధాని ఢిల్లీలో 73,780 కరోనా సోకిన రోగులు ఉన్నారు. కాగా తమిళనాడులో 70,977 కేసులు నమోదయ్యాయి.
దేశంలో రాష్ట్రాలవారీగా కరోనా కేసులు:
మహారాష్ట్ర – 147741
ఢిల్లీ – 73780
తమిళనాడు – 70977
గుజరాత్ – 29520
ఉత్తర ప్రదేశ్ – 20193
రాజస్థాన్ – 16296
బెంగాల్ – 15648
మధ్యప్రదేశ్ – 12596
హర్యానా – 12463
తెలంగాణ – 11364
ఆంధ్రప్రదేశ్ – 10884
కర్ణాటక – 10560
బీహార్ – 8473
జమ్మూ కాశ్మీర్ – 6549
అస్సాం – 6321
ఒడిశా – 5962
పంజాబ్ – 4769
కేరళ – 3726
ఉత్తరాఖండ్ – 2691
ఛత్తీస్ఘడ్ – 2452
జార్ఖండ్ – 2262
త్రిపుర – 1290
మణిపూర్ – 1056
గోవా – 995
లడఖ్ – 941
హిమాచల్ ప్రదేశ్ – 839
పుదుచ్చేరి – 502
చండీగర్ – 423
నాగాలాండ్ – 355
అరుణాచల్ – 160
దాదర్-నగర్ హవేలి – 155
మిజోరం – 145
సిక్కిం – 85
అండమాన్-నికోబార్ – 59
మేఘాలయ – 46
407 deaths and highest single-day spike of 17,296 new #COVID19 positive cases reported in India in the last 24 hours.
Positive cases in India stand at 4,90,401 including 1,89,463 active cases,2,85,637cured/discharged/migrated & 15301 deaths: Ministry of Health & Family Welfare pic.twitter.com/g8EjQz2UwA
— ANI (@ANI) June 26, 2020
Read: యూపీలో ఆత్మ నిర్భర్ రోజ్ గార్ అభియాన్ ను ప్రారంభించిన ప్రధాని : ప్రజలకు మోడీ మోటివేషనల్ స్పీచ్