నిర్భయ దోషుల ఉరిపై సందిగ్ధత

నిర్భయ దోషుల ఉరిపై సందిగ్ధత కొనసాగుతోంది. రేపు నలుగురు హంతకులకు శిక్ష అమలు చేస్తారా, లేదా అనే అనుమానాల మధ్యే తిహార్‌ జైలు అధికారులు ఉరికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

  • Published By: veegamteam ,Published On : January 31, 2020 / 03:58 AM IST
నిర్భయ దోషుల ఉరిపై సందిగ్ధత

Updated On : January 31, 2020 / 3:58 AM IST

నిర్భయ దోషుల ఉరిపై సందిగ్ధత కొనసాగుతోంది. రేపు నలుగురు హంతకులకు శిక్ష అమలు చేస్తారా, లేదా అనే అనుమానాల మధ్యే తిహార్‌ జైలు అధికారులు ఉరికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

నిర్భయ దోషుల ఉరిపై సందిగ్ధత కొనసాగుతోంది. రేపు నలుగురు హంతకులకు శిక్ష అమలు చేస్తారా, లేదా అనే అనుమానాల మధ్యే తిహార్‌ జైలు అధికారులు ఉరికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మీరట్‌ జైలులో పనిచేసే తలారి పవన్‌ జల్లాద్‌ తిహార్‌ జైలుకు చేరుకున్నాడు. ఇవాళ డమ్మీ ఉరి తీసేందుకు సిద్ధమయ్యాడు. ఫిబ్రవరి 1న నలుగురు దోషుల్ని ఉరి తీయాలంటూ పటియాలా హౌస్‌కోర్ట్‌ డెత్‌ వారెంట్‌ జారీ చేయడంతో… అందుకోసం తిహార్‌ జైలు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

తీహార్‌ జైలుకు చేరుకున్న తలారీ పవన్‌ జల్లాద్
ఉరిశిక్ష అమలుకు కేవలం ఒక్కోరోజు గడువు మాత్రమే ఉండటంతో… శిక్షను అమలుపర్చేందుకు తలారీ పవన్‌ జల్లాద్ తీహార్‌ జైలుకు చేరుకున్నాడు. జైలు ప్రాంగణంలో ఆయన కోసం ప్రత్యేక గది, వసతి ఏర్పాట్లు చేశారు. తలారి పవన్‌ జల్లాద్ జైలు ప్రాంగణంలోనే ఉండి ఉరితాడు సామర్థ్యంతో పాటు ఇతర విషయాలను పరిశీలిస్తారని అధికారులు వెల్లడించారు. ఉరితీత సన్నాహాల్లో భాగంగా ఇవాళ పవన్‌ డమ్మీ ఉరిని నిర్వహించనున్నారు.

ఉరితీతకు ఏర్పాట్లు
తలారి పవన్‌ జల్లాద్‌ మీరట్ వాసి. నిర్భయ దోషులకు ఉరిశిక్షను అమలు చేయాలంటూ పవన్‌ తిహార్‌ జైలు అధికారులు అభ్యర్థించారు. జనవరి 30 నుంచి ఫిబ్రవరి 1 వరకు పవన్‌ సేవల్ని అందించాలని కోరడంతో… ఆయన తిహార్‌ కారాగారానికి చేరుకుని ఉరితీతకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. న్యాయపరమైన చిక్కులేవీ ఎదురుకాకుండా వుంటే నిర్భయ కేసులో నలుగురు దోషులైన పవన్ గుప్తా, అక్షయ్ ఠాకూర్, ముఖేశ్ సింగ్, వినయ్ శర్మకు రేపు ఉరిశిక్ష అమలు కానుంది. రేపు ఉదయం ఆరు గంటలకు తిహార్ జైల్లో నలుగురిని ఉరి తీసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

నలుగురు దోషులకు ఏకకాలంలో ఉరి
కొద్దిరోజుల ముందు నిర్భయ దోషులకు ఉరి వేసేందుకు జైలు అధికారులు ట్రయల్స్‌ నిర్వహించారు. ఇందుకోసం బక్సర్ నుంచి తాళ్లను తెప్పించారు. మూడో నంబర్‌ జైలులో నిర్భయ దోషులు నలుగురిని ఏకకాలంలో ఉరి తీయనున్నారు. అయితే తమకు విధించిన ఉరిశిక్ష అమలు కాకుండా ఆపేందుకు నిర్భయ దోషులు అన్నివిధాలా ప్రయత్నిస్తున్నారు. తాజాగా నిర్భయ దోషి అక్షయ్‌కుమార్‌ వేసుకున్న క్యురేటివ్‌ పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది.

రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్
దాంతో పాటు ఫిబ్రవరి 1న అమలు కానున్న ఉరిశిక్షపై స్టే విధించాల్సిందిగా అతడు వేసిన మరో పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. మరో నిందితుడు వినయ్‌ శర్మ రాష్ట్రపతికి పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ ఇంకా పెండింగ్‌లోనే ఉంది. ఈ నేపథ్యంలో నిర్భయ దోషులకు రేపు ఉరిశిక్ష అమలవుతుందా లేదా అన్న ఉత్కంఠ నెలకొంది.