సబ్బుతో తుపాకులు కడిగిన మహిళ.. వీడియో చూసి దర్యాప్తు చేసిన పోలీసులు.. వెలుగులోకి సంచలన విషయాలు

చీర కట్టుకుని ఉన్న ఓ మహిళ పిస్టల్‌ను పట్టుకుని దానికి సబ్బు పెట్టి, బ్రష్‌తో రుద్దింది. ఈ వీడియోను చూసిన..

సబ్బుతో తుపాకులు కడిగిన మహిళ.. వీడియో చూసి దర్యాప్తు చేసిన పోలీసులు.. వెలుగులోకి సంచలన విషయాలు

కేటుగాళ్లు చేసే చిన్న చిన్న పొరపాట్లే వారిని పోలీసులకు పట్టిస్తాయి. అటువంటి ఘటనే ఇటీవల మధ్యప్రదేశ్‌లోని మొరెనా జిల్లాలో చోటుచేసుకుంది. ఓ మహిళ సబ్బుతో పిస్టల్స్ కడుగుతుండగా ఒకరు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు అక్రమ ఆయుధాల ఫ్యాక్టరీ గుర్తించారు.

వీడియోలో ఉన్న దాని ప్రకారం.. చీర కట్టుకుని ఉన్న ఓ మహిళ పిస్టల్‌ను పట్టుకుని దానికి సబ్బు పెట్టి, బ్రష్‌తో రుద్దింది. ఈ వీడియోను చూసిన పోలీసుల బృందం గణేశ్ పురా ప్రాంతంలోని ఒక ఇంట్లో సోదాలు చేసింది. వారికి ఆయుధాలు కనపడ్డాయి. ఆరు నెలలుగా కేటుగాళ్లు ఈ ఆయుధాల యూనిట్ ను నిర్వహిస్తున్నట్లు మహువా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ పవన్ సింగ్ మీడియాకు తెలిపారు.

ఆ అక్రమ ఆయుధ ఫ్యాక్టరీ నుంచి మూడు దేశీయ తుపాకులు, తయారీలో ఉన్న పలు ఆయుధాలు, ఇతర పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా ఆయుధాలు తయారు చేస్తున్న వారి నుంచి పలు వివరాలు రాబట్టిన పోలీసులు కేసులో తదుపరి విచారణ జరుపుతున్నారు.

Also Read: విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు.. కూటమి అభ్యర్థి ఖరారు?