India vs sri lanka 2nd ODI: రెండో వన్డేలోనూ భారత్దే విజయం.. సిరీస్ కైవసం.. ఫొటో గ్యాలరీ
India vs sri lanka 2nd ODI: ఇండియా వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా గురువారం ఈడెన్ గార్డెన్స్లో రెండో వన్డే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో శ్రీలంకపై విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్ల సిరీస్లో 2-0తో సిరీస్ను కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు తక్కువ స్కోర్కే ఆలౌట్ అయింది. బ్యాటర్ల పేలవ ప్రదర్శనతో 39.4 ఓవర్లలో 215 పరుగులకు ఆలౌటైంది. అరంగ్రేటం ఆటగాడు నువనిదు ఫెర్నాండో (50) అర్థశతకంతో రాణించాడు. కుల్దీప్ యాదవ్, సిరాజ్ చెరో మూడు వికెట్లు తీశారు. తరువాత బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ తొలుత తడబడినప్పటికీ.. 43.2 ఓవర్లలో 216 పరుగుల లక్ష్యాన్ని చేధించారు. కేఎల్ రాహుల్ 64 పరుగులతో నాటౌట్గా నిలిచి ఇండియా విజయంలో కీలక భూమిక పోషించాడు.