Bharat Jodo Yatra: కేరళలో 17వ రోజు కొనసాగుతున్న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర.. భారీ సంఖ్యలో పాల్గొన్న కాంగ్రెస్ శ్రేణులు (ఫొటో గ్యాలరీ)

Bharat Jodo Yatra: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన భారత్ జోడో యాత్ర శనివారం కేరళ రాష్ట్రంలో కొనసాగుతోంది. శుక్రవారం పాదయాత్ర విశ్రాంతి అనంతరం శనివారం(17వ రోజు) పున: ప్రారంభమైంది. ఉదయం త్రిసూర్ జిల్లా పెరంబ్రా జంక్షన్ నుంచి ఉదయం 6.30 గంటలకు రాహుల్ పాదయాత్రను ప్రారంభించారు. 12 కి.మీ పాదయాత్ర ఉదయం 10గంటల వరకు అంబ్లూరు జంక్షన్ వద్దకు చేరుకుంది. అక్కడే రాహల్ విశ్రాంతి తీసుకున్నారు. ఆయా వర్గాల ప్రజలతో సమావేశమై వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను, వారి సమస్యలను తెలుసుకుంటారు. సాయంత్రం 5గంటలకు టాలోర్ బైపాస్ జంక్షన్ వద్ద నుంచి రాహుల్ తన పాదయాత్రను కొనసాగిస్తారు. సాయంత్రం 7గంటలకు పాదయాత్ర స్వరాజ్ రౌండ్ రోడ్ వద్దకు చేరుకుంటుంది. ఆ రాత్రి థోప్ గ్రౌండ్ వద్ద రాహుల్ బస చేస్తారు. ఇదిలాఉంటే రాహుల్ గాంధీ పాదయాత్రలో భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. స్థానిక కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలతో పాటు ప్రజలు పెద్ద ఎత్తున యాత్రలో పాల్గొన్నారు. దారిపొడవునా రాహుల్ కు స్వాగతం పలికేందుకు వేచియున్న ప్రజలకు అభివాదం చేసుకుంటూ రాహుల్ ముందుకు సాగారు. పలు ప్రాంతాల్లో స్థానికులతో సమావేశమవుతూ వారు ఎదుర్కొంటున్న సమస్యలపై రాహుల్ ఆరాతీశారు.

1/16Rahul Gandhi's Bharat Jodo Yatra is on its 17th day in Kerala
Rahul Gandhi's Bharat Jodo Yatra is on its 17th day in Kerala
2/16
Rahul Gandhi1
3/16
Rahul Gandhi2
4/16
Rahul Gandhi3
5/16
Rahul Gandhi4
6/16
Rahul Gandhi5
7/16
Rahul Gandhi6
8/16
Rahul Gandhi7
9/16
Rahul Gandhi8
10/16
Rahul Gandhi9
11/16
Rahul Gandhi10
12/16
Rahul Gandhi11
13/16
Rahul Gandhi12
14/16
Rahul Gandhi13
15/16
Rahul Gandhi14
16/16
Rahul Gandhi15