Naresh Bansal: రాజ్యాంగం నుంచి ‘ఇండియా’ పేరు తొలగించాలంటూ ఏకంగా పార్లమెంటులోనే సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ

ఇటీవల బెంగళూరులో జరిగిన ఓ సమావేశంలో ప్రతిపక్ష పార్టీలు తమ కూటమికి ఇండియా అని పేరు పెట్టుకున్నాయి. కూటమి పేరు తెరపైకి వచ్చినప్పటి నుంచి బీజేపీ నేతలు విపక్షాలపై విరుచుకుపడుతున్నారు

Naresh Bansal: రాజ్యాంగం నుంచి ‘ఇండియా’ పేరు తొలగించాలంటూ ఏకంగా పార్లమెంటులోనే సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ

Updated On : July 28, 2023 / 3:52 PM IST

BJP MP Naresh Bansal: ఇండియా అనే పదాన్ని రాజ్యాంగం నుంచి తొలగించాలని ఉత్తరాఖండ్‌కు చెందిన బీజేపీ రాజ్యసభ (Rajya Sabha) ఎంపీ నరేష్ బన్సాల్ సంచలన డిమాండ్ చేశారు. ‘ఇండియా’ (INDIA) అనేది వలసరాజ్యం విధించిన పదమని ఆయన వాదించారు. ఆ పేరు మన దేశంలో నేటికీ బానిసత్వానికి చిహ్నమని, దానిని వెంటనే తొలగించాలని బీజేపీ ఎంపీ అన్నారు.

Bengaluru Woman: ‘మరీ తెల్లగా ఉన్నారు కాబట్టి ఉద్యోగం ఇవ్వలేం’ కంపెనీ సమాధానానికి షాక్ అయిన యువతి

గత ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ బానిసత్వ చిహ్నాలను వదిలించుకోవాలని విజ్ఞప్తి చేశారని బీజేపీ ఎంపీ గుర్తు చేశారు. గత 9 ఏళ్లలో మోదీ ప్రభుత్వం అనేక సందర్భాల్లో వలస వారసత్వం, వలస చిహ్నాలను తొలగించాలని విజ్ఞప్తి చేసిందని బన్సాల్ చెప్పారు. అదే సమయంలో, వాటి స్థానంలో భారతీయ చిహ్నాలు, విలువలు, ఆలోచనలను అమలు చేయాలని ఆయన సూచించారు.

Delhi-Mumbai Flight : విమానంలో ప్రొఫెసర్ వెర్రివేషాలు .. మహిళా డాక్టర్‌‌పై లైంగిక వేధింపులు,అరెస్ట్

ఇంకా ఆయన మాట్లాడుతూ విప్లవకారులు, స్వాతంత్య్ర సమరయోధుల బలిదానం, కష్టపడి దేశానికి స్వాతంత్య్రం వచ్చాక 1950లో రాజ్యాంగాన్ని రూపొందించారన్నారు. ఇండియా దట్ ఈజ్ భారత్ (ఇండియా దట్ ఈజ్ ఇండియా) అని రాజ్యాంగంలో రాశారు. ప్రాచీన కాలం నుంచి దేశానికి భారత్ అనే పేరు ఉందని, ఆ పేరుతోనే పిలవాలని బన్సాల్ అన్నారు. స్వాతంత్య్ర స్వర్ణయుగంలో వలస వారసత్వాన్ని దూరం చేయాలని కోరారు.


ఇటీవల బెంగళూరులో జరిగిన ఓ సమావేశంలో ప్రతిపక్ష పార్టీలు తమ కూటమికి ఇండియా అని పేరు పెట్టుకున్నాయి. కూటమి పేరు తెరపైకి వచ్చినప్పటి నుంచి బీజేపీ నేతలు విపక్షాలపై విరుచుకుపడుతున్నారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని మోదీ కూడా ఇండియా అనే పేరు పెట్టడం వల్ల ఏమీ జరగదని అన్నారు. ఇండియన్‌ ముజాహిదీన్‌, ఈస్ట్‌ ఇండియా కంపెనీల్లో కూడా ఇండియా అనే పదం ఉందని ఎద్దేవా చేశారు.

Breach of protocol: బెంగళూరు విమానాశ్రయంలో ప్రొటోకాల్ ఉల్లంఘన.. ఏకంగా గవర్నర్‭నే వదిలేసి వెళ్లిన ఎయిర్ ఏషియా విమానం

ఎంపీ బన్సాల్ కంటే ముందు, సీనియర్ బీజేపీ నేత, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ కూడా ఇండియా అనే పదాన్ని వలసవాదానికి చిహ్నమని అని అన్నారు. అంతే కాకుండా తన అధికారిక ట్విటర్ ఖాతాలో ఇండియా అనే పేరు తొలగించి, భారత్ అని చేర్చారు.