చంద్రబాబు లొల్లిరాజకీయాలు మానుకోవాలి : జీవీఎల్
విజయవాడ: విశాఖపట్నం రైల్వే జోన్ ను ప్రజలంతా స్వాగతిస్తుంటే చంద్రబాబు రాజకీయ లబ్దికోసం లొల్లి రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహా రావు ఆరోపించారు. విశాఖ రైల్వే జోన్ ను కేంద్ర ప్రకటిస్తే, దానిపై స్టిక్కరు వేసుకునే అవకాశం లేక పోవటం వల్ల చంద్రబాబు తప్పుడు వ్యాఖ్యలు చేయటం సరికాదని జీవీఎల్ హితవు పలికారు.
Read Also : జగన్ అనే నేను : చనిపోయాకా బతికుండాలి.. అందుకే సీఎం కావాలి
వాల్తేరు డివిజన్ మొత్తాన్ని రాయ్ గడ్ కి ఇవ్వలేదని, ఏపీకి సంబంధించి వాల్తేరు డివిజన్లో వాటిని విశాఖపట్నం జోన్ లోనే ఉంచటం జరిగిందని ఆయన వివరించారు. కాకపోతే ఆ ప్రాంతాలను సెపరేట్ గా డివిజన్ చేసే అవకాశం లేదు కనుక దాన్ని విజయవాడ డివిజన్ లో కలపటం జరిగిందని తెలిపారు.
విజయవాడ. గుంటూరు, గుంతకల్, డివిజన్లు మూడింటిని సికింద్రాబాద్ జోన్ నుంచి తీసి విశాఖ జోన్ కిచ్చారని, ఈ అంశాన్ని మెచ్చుకోవాల్సింది పోయి రచ్చ చేయటం చంద్ర బాబు రాజకీయ దుర్భుధ్దికి కారణం తప్ప మరేం కాదని ఆయన అన్నారు. ఏ జోన్ కు ఎంత ఆదాయం వస్తుందనేది రైల్వే వారు వేసుకునే అంచనా అని జీవీఎల్ అన్నారు.
Read Also : టీడీపీలో టిక్కెట్ రాకుంటే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తా!