Perni Nani : అందుకే.. వాలంటీర్ల జీతం 10వేలకు పెంచుతామని చంద్రబాబు అంటున్నారు- పేర్నినాని

ప్రభుత్వ సేవలను నేరుగా పేద మధ్య తరగతి వర్గాలకు వాలంటీర్ల ద్వారా అందించడంతో.. సీఎం జగన్ ప్రభుత్వంపై ప్రజలందరికీ నమ్మకం ఏర్పడింది.

Perni Nani : అందుకే.. వాలంటీర్ల జీతం 10వేలకు పెంచుతామని చంద్రబాబు అంటున్నారు- పేర్నినాని

Perni Nani : తమ ప్రభుత్వం వచ్చాక వాలంటీర్లకు జీతం 10వేలకు పెంచుతాం అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి పేర్నినాని కౌంటర్ ఇచ్చారు. వాలంటీర్ల వ్యవస్థను నాశనం చేద్దామనుకున్న చంద్రబాబు నేడు వాలంటీర్లపై కల్లబొల్లి ప్రేమ ఒలకపోస్తున్నారని పేర్నినాని మండిపడ్డారు. చంద్రబాబు కుటిల వాగ్దానాలను ఎవరు నమ్మరు అని ఆయన అన్నారు. ప్రజల్లో తిరుగుబాటు రావడంతోనే వాలంటీర్ల విషయంలో చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని కామెంట్ చేశారు.

”సేవ కోసం పని చేసే వాలంటీర్లు.. చంద్రబాబు గాలానికి పడరు. బూటకపు మాటలు, నయవంచనకు ప్రతిరూపం చంద్రబాబు. ప్రజలకు గాలం వెయ్యడం.. వారిని వాడుకుని వదిలేయడం అయిపోయింది. ఇప్పుడు కొత్తగా వాలంటీర్లకు 10వేలు జీతం పెంచుతామని కొత్త ఎర వేస్తున్నారు. వాలంటీర్ల ఆత్మాభిమానాన్ని కించపరుస్తూ వారి వ్యక్తిత్వాన్ని హననం చేసిన చంద్రబాబు ఇప్పుడు నీతి మాటలు చెబుతున్నారు. మూడు పదులు నిండని వాలంటీర్లపై.. చంద్రబాబు అండ్ కో చాలా దారుణంగా మాట్లాడారు.

ప్రభుత్వ సేవలను నేరుగా పేద మధ్య తరగతి వర్గాలకు వాలంటీర్ల ద్వారా అందించడంతో.. సీఎం జగన్ ప్రభుత్వంపై ప్రజలందరికీ నమ్మకం ఏర్పడింది. నేడు ఎన్నికలు వచ్చిన నేపథ్యంలో వాలంటీర్లను దుర్భాషలాడిన చంద్రబాబు.. వారిపై కల్లబొల్లి ప్రేమ ఒలకపోస్తున్నారు. ఒకవైపు ప్రజాస్వామ్య ముసుగులో చంద్రబాబు మాట్లాడుతున్నారు. మరోవైపు ఆయన తాబేదారు నిమ్మగడ్డ రమేశ్ వాలంటీర్లపై ఫిర్యాదులు చేస్తారు.

చంద్రబాబు, నిమ్మగడ్డ కుటిల రాజకీయాలతో వాలంటీర్ల సేవలు అందక లక్షలాది మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సేవా దృక్పథంతోనే విద్యావంతులు వాలంటీర్లుగా పని చేస్తున్నారు. చంద్రబాబు అబద్ధపు వాగ్దానాలు నమ్మే రోజులు ఎప్పుడో పోయాయి” అని పేర్ని నాని అన్నారు.

Also Read : ఆ ఇద్దరిలో ఎవరు గెలిచినా, ఎవరు ఓడినా చరిత్రే.. భీమిలిలో గురు శిష్యుల మధ్య రసవత్తర పోరు