IPL 2024 : రెండు మ్యాచ్లను రీ షెడ్యూల్ చేసిన బీసీసీఐ
ఐపీఎల్ షెడ్యూల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి
![IPL 2024 : రెండు మ్యాచ్లను రీ షెడ్యూల్ చేసిన బీసీసీఐ IPL 2024 : రెండు మ్యాచ్లను రీ షెడ్యూల్ చేసిన బీసీసీఐ](https://10tv.in/wp-content/uploads/2024/04/BCCI-Reschedules-Two-IPL-2024-Matches.jpg)
BCCI Reschedules Two IPL 2024 Matches
ఐపీఎల్ 2024 సీజన్లో మ్యాచ్లు ఆసక్తికరంగా సాగుతున్నాయి. కాగా.. ఈ సీజన్కు సంబంధించిన షెడ్యూల్ను రెండు దఫాలుగా బీసీసీఐ విడుదల చేసింది. అయితే.. తాజాగా ఈ షెడ్యూల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఓ రెండు మ్యాచ్లను రీ షెడ్యూల్ చేశారు. ఈ విషయాన్ని బీసీసీఐ వెల్లడించింది. ఈ నెల 17న శ్రీరామనవమి ఉండడంతో షెడ్యూల్ లో మార్పులు చేసినట్లుగా తెలుస్తోంది.
వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం అహ్మదాబాద్ వేదికగా ఏప్రిల్ 16న గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుండగా.. ఏప్రిల్ 17న కోల్కతాలోని ఈడెన్ గార్డెన్ వేదికగా రాజస్థాన్ రాయల్స్, కోల్కతా నైట్ రైడర్స్ మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే.. 17న శ్రీరామనవమి ఉండడంతో ఆ రోజున భద్రత కల్పించలేమని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్కు పోలీసులు తెలియజేశారు. దీంతో 17న జరగాల్సిన కేకేఆర్ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ను 16న, అలాగే 16న జరగాల్సిన గుజరాత్ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ను 17వ తేదీకి మార్చారు. డేట్లు మారాయి తప్పిస్తే.. వేదికల్లో ఎలాంటి మార్పు లేదు.
Ben Stokes : టీ20 ప్రపంచకప్ నుంచి తప్పుకున్న బెన్స్టోక్స్
రీ షెడ్యూల్ చేసిన మ్యాచ్లు ఇవే..
ఏప్రిల్ 16 – కేకేఆర్ వర్సెస్ ఆర్ఆర్ (ఈడెన్ గార్డెన్స్, కోల్కతా)
ఏప్రిల్ 17 – గుజరాత్ వర్సెస్ ఢిల్లీ (మోదీ స్టేడియం, అహ్మదాబాద్)
ఐపీఎల్ 17వ సీజన్ మార్చి 22న ప్రారంభమైన సంగతి తెలిసిందే. మే 26న ఫైనల్ మ్యాచ్తో ముగియనుంది. మొత్తం 53 మ్యాచులు జరగనున్నాయి. ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా జరగనుంది.
MS Dhoni : హైదరాబాద్లో అడుగుపెట్టిన ధోని..
ఇప్పటి వరకు 13 మ్యాచ్లు పూర్తి అయ్యాయి. ఆడిన మూడు మ్యాచుల్లో విజయం సాధించిన రాజస్తాన్ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. కోల్కతా రెండో స్థానంలో కొనసాగుతోంది.