PBKS vs MI : ముంబైతో కీల‌క మ్యాచ్‌కు ముందు పంజాబ్‌కు భారీ షాక్‌..! శ్రేయ‌స్ అయ్య‌ర్ ఇప్పుడేం చేస్తాడో మ‌రీ..

ముంబైతో కీల‌క మ్యాచ్‌కు ముందు పంజాబ్ కింగ్స్‌కు గ‌ట్టి షాక్ త‌గిలింది.

PBKS vs MI : ముంబైతో కీల‌క మ్యాచ్‌కు ముందు పంజాబ్‌కు భారీ షాక్‌..! శ్రేయ‌స్ అయ్య‌ర్ ఇప్పుడేం చేస్తాడో మ‌రీ..

Courtesy BCCI

Updated On : May 26, 2025 / 9:26 AM IST

ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో ఇప్ప‌టికే నాలుగు జ‌ట్లు ప్లేఆఫ్స్‌కు చేరుకున్నాయి. అయితే.. టాప్‌-2లో నిలిచే జ‌ట్లు ఏవో ఇంకా తేల‌లేదు. గుజ‌రాత్, ఆర్‌సీబీ, ముంబై, పంజాబ్ జ‌ట్లు టాప్‌-2 స్థానంలో నిలిచేందుకు తీవ్రంగా పోటీప‌డుతున్నాయి. ఆదివారం చెన్నై చేతిలో గుజ‌రాత్ ఓడిపోవ‌డంతో ఈ రేసు మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా మారింది. ఇక సోమ‌వారం జైపూర్ వేదిక‌గా పంజాబ్ కింగ్స్‌, ముంబై ఇండియ‌న్స్ త‌ల‌ప‌డుతున్నాయి.

ఈ మ్యాచ్‌లో పంజాబ్ విజ‌యం సాధిస్తే.. 19 పాయింట్ల‌తో టాప్‌-2లో స్థానాన్ని ఖాయం చేసుకుంటుంది. ఒక‌వేళ ఓడిపోతే మాత్రం టాప్‌-2 రేసు నుంచి నిష్ర్క‌మిస్తుంది. ఇక ముంబై ప‌రిస్థితి కూడా దాదాపుగా ఇలాగే ఉంది. ఈ మ్యాచ్‌లో ముంబై గెలిస్తే 18 పాయింట్ల‌తో టాప్‌-2లో ఉంటుంది. గుజ‌రాత్ (+0.254) కంటే ముంబై (+1.292) నెట్‌ర‌న్‌రేట్ మెరుగ్గా ఉండ‌డం ఇక్క‌డ క‌లిసి వ‌స్తుంది. ఒక‌వేళ ముంబై ఓడిపోతే నాలుగో స్థానంలోనే ప్లేఆఫ్స్‌లో అడుగుపెడుతుంది.

ALSO READ : SRH vs KKR : స‌న్‌రైజ‌ర్స్ పై ఓట‌మి.. కోల్‌క‌తా కెప్టెన్ ర‌హానే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. బౌల‌ర్ల వ‌ల్లే ఓడిపోయాం.. నెక్స్ట్ సీజ‌న్‌కు బ‌లంగా తిరిగొస్తాం..

ఈ కీల‌క మ్యాచ్‌కు ముందు పంజాబ్ కింగ్స్‌కు గ‌ట్టి షాక్ త‌గిలింది. ఈ మ్యాచ్‌లో స్టార్ స్పిన్న‌ర్ యుజ్వేంద్ర చాహ‌ల్ ఆడే అవ‌కాశాలు దాదాపుగా క‌నిపించ‌డం లేదు. పంజాబ్ ఆడిన చివ‌రి మ్యాచ్ జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తోనూ అత‌డు ఆడ‌లేదు. ESPNCricinfo నివేదిక ప్రకారం చాహల్ మణికట్టు గాయంతో బాధపడుతున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే ఆ జ‌ట్టు ప్లేఆఫ్స్‌కు అర్హ‌త సాధించ‌డంతో చాహ‌ల్ విష‌యంలో ఎలాంటి రిస్క్ తీసుకోకూడ‌ద‌ని ఆ జ‌ట్టు మేనేజ్‌మెంట్ భావిస్తోంది.

ప్లేఆఫ్స్‌ నాటికి అత‌డు పూర్తిగా కోలుకుంటాడ‌నే విశ్వాసంతో ఉంది. ప్లేఆఫ్స్‌లో చాహ‌ల్ ఆడ‌తాడ‌నే న‌మ్మ‌కంతో ఆ జ‌ట్టు ఉన్న‌ట్లు నివేదిక పేర్కొంది. ఢిల్లీతో మ్యాచ్‌లో అత‌డి స్థానంలో క‌ర్ణాట‌క స్పిన్న‌ర్ ప్ర‌వీణ్ దూబే ఆడాడు.