Team India: ఇంగ్లాండ్పై ఉత్కంఠభరిత విజయంతో బోణీ కొట్టిన భారత్
లార్డ్స్లో ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో టెస్ట్లో భారత్ ఘన విజయం సాధించింది. డ్రా దిశగా సాగుతున్న మ్యాచ్ని భారత బౌలర్లు ఒక్కసారిగా మార్చేశారు.
Team India: లార్డ్స్లో ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో టెస్ట్లో భారత్ ఘన విజయం సాధించింది. డ్రా దిశగా సాగుతున్న మ్యాచ్ని భారత బౌలర్లు ఒక్కసారిగా మార్చేశారు. ఇంగ్లాండ్ని కేవలం 120 పరుగులకే కట్టడి చేశారు. 151 పరుగుల తేడాతో భారత్కి ఘన విజయం అందించారు. చివరి రోజు ఆఖరి సెషన్ పది నిమిషాల వరకూ ఉత్కంఠభరితంగా సాగింది మ్యాచ్. క్రికెట్ ఫ్యాన్స్కి బీభత్సమైన క్రేజ్.. అందించి ఈ విజయంతో ఐదు టెస్టుల సిరీస్లో టీమిండియా 1-0 తేడాతో ఆధిక్యంలోకి వెళ్లింది టీమిండియా.
కెప్టెన్ జోరూట్ 33 పరుగులు, చివర్లో బట్లర్ 25 పరుగులు పరవాలేదనే స్కోరు నమోదు చేశారు. భారత్ బౌలర్లలో సిరాజ్ 4, బుమ్రా 3, ఇషాంత్ శర్మ 2 వికెట్లతో రాణించారు.
ఓవర్నైట్ స్కోర్ 181/6 తో ఐదో రోజు ఆటను ప్రారంభించిన భారత్.. బుమ్రా 34 పరుగులు, షమి హాఫ్ సెంచరీ చేశారు. అనంతరం పంత్ 22 పరుగులకే వెనుదిరిగాడు. కాసేపటికే స్కోరు 209 వద్ద ఇషాంత్ శర్మ 16 పరుగులు వికెట్లముందు దొరికిపోయాడు. అనంతరం జోడీ కట్టిన షమీ, బుమ్రా సింగిల్స్ తీస్తూ వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదారు. ఇద్దరు నాటౌట్గా నిలిచి 89 పరుగుల భాగస్వామ్యం జోడించారు. దీంతో భారత్ చివరికి 298/8 వద్ద డిక్లేర్ చేసింది.
WHAT. A. WIN! ? ?
Brilliant from #TeamIndia as they beat England by 1⃣5⃣1⃣ runs at Lord's in the second #ENGvIND Test & take 1-0 lead in the series. ? ?
Scorecard ? https://t.co/KGM2YELLde pic.twitter.com/rTKZs3MC9f
— BCCI (@BCCI) August 16, 2021
271 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన ఇంగ్లాండ్ జట్టును ముప్పుతిప్పలు పెట్టిన భారత బౌలర్లు… పరుగులకి ఆలౌట్ చేశారు. అసలు గెలుస్తుందా? అనుకున్న మ్యాచ్లో భారత్ పూర్తి ఆధిపత్యం కనబరిచి ఘన విజయం అందుకుంది.
మొదటి ఓవర్లోనే రోరీ బర్న్స్ను అవుట్ చేసిన జస్ప్రిత్ బుమ్రా… ఇంగ్లాండ్కి ఊహించని షాక్ ఇచ్చాడు. ఆ తర్వాతి ఓవర్లో డొమినిక్ సిబ్లీ కూడా డకౌట్ కావడంతో 1 పరుగుకే ఓపెనర్లు ఇద్దరినీ కోల్పోయింది ఇంగ్లాండ్. హసీబ్ హమీద్తో కలిసి మూడో వికెట్కి 43 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి, కెప్టెన్ జో రూట్ ఆదుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఉపయోగం లేకుండాపోయింది.
Great win! pic.twitter.com/bwCRrzsqbz
— Pelahuastine (@Pelahuastine) August 16, 2021
షమీ బౌలింగ్లో రోహిత్ శర్మ క్యాచ్ డ్రాప్ చేయడంతో బతికిపోయిన హసీబ్ హమీద్, 45 బంతుల్లో 9 పరుగులు చేసి ఇషాంత్ శర్మ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. 24 బంతుల్లో 2 పరుగులు చేసిన జానీ బెయిర్ స్టో, టీ బ్రేక్ ముందు ఇషాంత్ శర్మ వేసిన ఓవర్ ఆఖరి బంతికి ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. అంపైర్ నాటౌట్గా ప్రకటించినా, రివ్యూ తీసుకున్న విరాట్ కోహ్లీకి అనుకూల ఫలితం వచ్చింది.
ఓ ఎండ్లో వికెట్లు పడుతున్నా జో రూట్ ఎప్పటిలాగే 60 బంతుల్లో 5 ఫోర్లతో 33 పరుగులు చేసి… లంచ్ బ్రేక్ తర్వాతి ఓవర్లో జో రూట్ను అవుట్ చేశాడు జస్ప్రిత్ బుమ్రా. దాదాపు 16 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి, టీమిండియా బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టారు మొయిన్ ఆలీ, జోస్ బట్లర్. అయితే ఈ జోడీని సిరాజ్ విడదీశాడు.
What a game of cricket ?
Everyone stepping up, love the commitment and attitude. Way to go boys ?? ? pic.twitter.com/hSgmxkLiiP— Virat Kohli (@imVkohli) August 16, 2021
42 బంతుల్లో 2 ఫోర్లతో 13 పరుగులు చేసిన మొయిన్ ఆలీ, సిరాజ్ బౌలింగ్లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాతి బంతికే సామ్ కుర్రాన్ కూడా రిషబ్ పంత్కి క్యాచ్ ఇచ్చాడు. రాబిన్సన్ను బుమ్రా అవుట్ చేశాడు. జోస్ బట్లర్ను సిరాజ్ అవుట్ చేయడంతో 120 పరుగుల వద్ద రెండు వికెట్లు కోల్పోయింది ఇంగ్లాండ్. జేమ్స్ అండర్సన్ను క్లీన్బౌల్డ్ చేసిన సిరాజ్… 120 పరుగులకి ఇంగ్లాండ్ను ఆలౌట్ చేయించాడు. దీంతో భారత జట్టు 151 పరుగుల తేడాతో ఘన విజయం అందుకుంది.