లంక, ఆసీస్లతో సిరీస్లకు షమీ, రోహిత్కు రెస్ట్: బుమ్రా ఈజ్ బ్యాక్

టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా విరామం వదలి బరిలోకి దిగనున్నాడు. మోకాలి గాయం కారణంగా కొద్దిరోజులుగా విండీస్ జట్టుతో ఆటకు దూరమైయ్యాడు బుమ్రా. ఆ సిరీస్లో చోటు దక్కించుకోని ధావన్కు స్థానం దక్కింది. 2020 జనవరిలో శ్రీలంకతో టీ20 సిరీస్, ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లో టీమిండియా తలపడనుంది. ఈ మేర టీమిండియా సెలక్టర్లు సోమవారం రెండు వేర్వేరు జట్లని ప్రకటించారు.
బుమ్రా, ధావన్ లకు చోటు దక్కడంతో ఓపెనర్ రోహిత్ శర్మకు రెస్ట్ దొరికింది. వీరితో పాటు సీనియర్ పేసర్ మహ్మద్ షమీకి లంకతో టీ20 సిరీస్కు విశ్రాంతినిచ్చారు. కేఎల్ రాహుల్తో కలిసి ధావన్ టీ20 ఓపెనింగ్ ఇన్నింగ్స్ ఆడనున్నారు. జనవరి 5 నుంచి లంకతో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ జరుగుతుండగా.. ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ జనవరి 14 నుంచి ఆరంభం కానుంది. కొత్త ఏడాది పరిమిత ఓవర్లలో భారత జట్టుకు విరాట్ కోహ్లీ నాయకత్వం వహించనున్నాడు.
ఆ తర్వాత జనవరి 24 నుంచి న్యూజిలాండ్ పర్యటనకి టీమిండియా వెళ్లనుంది. 5 టీ20లు, 3 వన్డేలు, 2 టెస్టుల సుదీర్ఘ సిరీస్ని ఆడనున్న నేపథ్యంలో.. సీనియర్ క్రికెటర్లకి తగినంత విశ్రాంతి ఇవ్వాలని భారత్ సెలక్టర్లు నిర్ణయించారు. శ్రీలంకతో జనవరి 5న తొలి టీ20 మ్యాచ్ గౌహతి వేదికగా జరగనుండగా.. ఆ తర్వాత 7న ఇండోర్, 10న పుణె వేదికగా ఆఖరి టీ20ని నిర్వహించనున్నారు. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో 14 నుంచి మూడు వన్డేల సిరీస్లో టీమిండియా తలపడనుంది.
Sri Lanka T20లకు భారత జట్టు: Virat Kohli (c), Shikhar Dhawan, KL Rahul, Shreyas Iyer,Manish Pandey, Sanju Samson, Rishabh Pant (wk), Shivam Dube, Yuzvendra Chahal, Kuldeep Yadav,Ravindra Jadeja, Shardul Thakur, Navdeep Saini, Jasprit Bumrah, Washington Sundar
Australia ODIలకు భారత జట్టు: Virat Kohli (Capt),Rohit Sharma (vc), Shikhar Dhawan, KL Rahul,Shreyas Iyer, Manish Pandey, Kedar Jadhav, Rishabh Pant (wk, Shivam Dube, Ravindra Jadeja, Yuzvendra Chahal,Kuldeep Yadav,
Navdeep Saini,Jasprit Bumrah,Shardul Thakur, Mohd. Shami