IPL 2025 : ఉత్కంఠ పోరులో ముంబైపై లక్నో విజయం

తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగుల భారీ స్కోర్ చేసింది.

IPL 2025 : ఉత్కంఠ పోరులో ముంబైపై లక్నో విజయం

Courtesy BCCI

Updated On : April 4, 2025 / 11:34 PM IST

IPL 2025 : ఐపీఎల్ 2025 టోర్నీలో భాగంగా ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడ్డాయి. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో లక్నో గెలుపొందింది. 12 పరుగుల తేడాతో ముంబైని చిత్తు చేసింది. లక్నో వేదికగా జరిగిన ఈ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగుల భారీ స్కోర్ చేసింది.

204 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన ముంబై.. చివరి వరకు పోరాటం చేసింది. గెలుపు ముంగిట బోల్తా పడింది. భారీ స్కోర్ ను చేధించలేకపోయింది. 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 191 పరుగులకే పరిమితమైంది. ఒకానొక దశలో ముంబై గెలుస్తుందని ఫ్యాన్స్ ఆశించారు. చివరికి ఓటమి తప్పలేదు. లక్నో బౌలర్లలో శార్దూల్ ఠాకూర్, ఆకాశ్ దీప్, అవేశ్ ఖాన్, దిగ్వేశ్ రాఠి తలో వికెట్ తీశారు.

Also Read : వెంక‌టేష్ అయ్య‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. ఎక్కువ డ‌బ్బులిచ్చారు క‌దా అని..

ముంబై బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీతో రాణించాడు. 43 బంతుల్లో 67 పరుగులు చేశాడు. నమన్ ధీర్ (46), హార్ధిక్ ప్యాండా (28), తిలక్ వర్మ (25) పరుగులు చేశారు.

ఈ సీజన్ లో ముంబైకి ఇది మూడో ఓటమి. ఇప్పటివరకు నాలుగు మ్యాచులు ఆడగా కేవలం ఒకదాంట్లో మాత్రమే గెలుపొందింది. లక్నో జట్టుకి ఈ సీజన్ లో ఇది రెండో విజయం. ఇప్పటివరకు నాలుగు మ్యాచులు ఆడగా రెండింటిలో ఓడిపోయింది.