IPL 2025: చెలరేగిపోయిన బెంగళూరు బౌలర్లు.. పరుగులకే పంజాబ్ ఆలౌట్..

పంజాబ్ బ్యాటింగ్ లైనప్ సైకిల్ స్టాండ్ ను తలపించింది. కీలక మ్యాచ్ లో బ్యాట్స్ మెన్ చేతులెత్తేశారు.

IPL 2025: చెలరేగిపోయిన బెంగళూరు బౌలర్లు.. పరుగులకే పంజాబ్ ఆలౌట్..

Courtesy BCCI

Updated On : May 29, 2025 / 9:00 PM IST

కీలకమైన క్వాలిఫయర్ 1 మ్యాచ్ లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ బౌలర్లు చెలరేగిపోయారు. పంజాబ్ కింగ్స్ బ్యాటర్లను బెంబేలెత్తించారు. కట్టుదిట్టమైన బౌలింగ్ తో పంజాబ్ బ్యాటర్లను కట్టడి చేశారు. దీంతో పంజాబ్ వరుసగా వికెట్లు కోల్పోయింది. చివరికి 14.1 ఓవర్లలో 101 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన ఆర్సీబీ బౌలింగ్ ఎంచుకుంది. ఆదిలోనే పంజాబ్ పీకల్లోతు కష్టాల్లో పడింది. 50 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కోలుకోలేకపోయింది. పంజాబ్ బ్యాటింగ్ లైనప్ సైకిల్ స్టాండ్ ను తలపించింది. కీలక మ్యాచ్ లో బ్యాట్స్ మెన్ చేతులెత్తేశారు.

బెంగళూరు బౌలర్లు అంతా చెలరేగిపోయారు. సుయాశ్ శర్మ, హేజిల్ వుడ్ తలో 3 వికెట్లు పడగొట్టారు. యశ్ దయాల్ 2 వికెట్లు తీశాడు. భువనేశ్వర్ కుమార్, షెపర్డ్ చెరో వికెట్ తీశారు.

Also Read: ఈ క్రికెటర్‌ చేసిన ఒక్కో పరుగుకు రూ.10 లక్షల చొప్పున చెల్లించిన లక్నో సూపర్ జెయింట్స్‌.. మొత్తం రూ.27 కోట్లు వృథా