ఈ సారి ఐపీఎల్ మ్యాచ్లు జమ్మూ కశ్మీర్లో..: గంభీర్
ఈ సారి ఐపీఎల్ మ్యాచ్లను జమ్మూ కశ్మీర్లో నిర్వహించే అవకాశాలున్నాయని టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ వ్యాఖ్యానించాడు.

ఈ సారి ఐపీఎల్ మ్యాచ్లను జమ్మూ కశ్మీర్లో నిర్వహించే అవకాశాలున్నాయని టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ వ్యాఖ్యానించాడు.
ఈ సారి ఐపీఎల్ మ్యాచ్లను జమ్మూ కశ్మీర్లో నిర్వహించే అవకాశాలున్నాయని టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ వ్యాఖ్యానించాడు. ఎన్నికల ప్రచారంలో స్కీములు, ఆఫర్లు ఎంతవరకైనా వెళ్తాయనడానికి.. గంభీర్ చేసిన వ్యాఖ్యలే ఉదహరణగా చెప్పుకోవచ్చు. జమ్మూ రాష్ట్రంలోని ఓ నియోజకవర్గం నుంచి లోక్సభ స్థానానికి పోటీ చేస్తున్న డా.జితేందర్ సింగ్ తరపున గౌతం గంభీర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు.
Read Also : శ్రేయాస్ అయ్యర్కు తలనొప్పిగా మారిన ఢిల్లీ గాయాలు
ఈ సందర్భంగా ఎవరైతే ఎంపీ ప్రజల గురించి వారి సంక్షేమం గురించి పనిచేస్తాడో వారికే ఓటు వేయాలని కోరాడు. ఈ సారి ఎన్నికల్లో మొదటి నుంచి సెలబ్రిటీలను ఎన్నికల ప్రచారంలోకి వాడుతున్న బీజేపీ.. గంభీర్ను ఇటీవలి కాలంలోనే కమలం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించింది. ఈ క్రమంలో జమ్మూలో ఎప్పుడూ లేనంతగా వరల్డ్ క్లాస్ స్టేడియం అనుమతులు వచ్చాయని గంభీర్ ప్రచారంలో భాగంగా చెప్పుకొచ్చాడు.
ఈ స్టేడియం త్వరగా పూర్తి అయితే ఈ సారి ఐపీఎల్(ఇండియన్ ప్రీమియర్ లీగ్) జమ్మూలోనే జరిగే సూచనలున్నాయని తెలిపాడు. కాకపోతే ఇదంతా జరగాలంటే.. బీజేపీకి ఓటేసి మరోసారి నరేంద్ర మోడీనే ప్రధానమంత్రిని చేయాలని సూచించాడు. గంభీర్ చెప్పినట్లు జమ్మూలో ఐపీఎల్ మ్యాచ్ లు నిర్వహించాలంటే ఆ రాష్ట్రం నుంచి కూడా ఐపీఎల్ జట్టు తయారవుతుందా.. లేదా గంభీర్ పొరబాటున జమ్మూలో తయారుకానున్న స్టేడియం గురించి చెప్పబోయి తప్పులో కాలేశాడా.. అనేది ఆ స్పీచ్ విన్న ఓటర్లకే తెలియాలి.
#ElectionCampaign: विख्यात क्रिकेट खिलाड़ी श्री गौतम गंभीर ने भारतीय जनता पार्टी की सदस्यता ग्रहण करने के बाद आज अपनी सर्वप्रथम रैली रामनगर और नगरी, कठुआ में की।#NaMoForNewIndia
Tap below for #Video pic.twitter.com/jjoHvhzBDs
— Chowkidar Dr Jitendra Singh (@DrJitendraSingh) April 11, 2019