ఎందుకంట: IPL 2019 ఆరంభ వేడుకలు రద్దు

ఐపీఎల్ 11వ సీజన్ అనంతరం భారీ అంచనాలుతో సిద్ధం అవుతున్న 12వ సీజన్కు సర్వత్రా ఉత్కంఠత మొదలైంది. లీగ్లోని తొలి మ్యాచ్ను మార్చి 23న డిఫెండింగ్ చాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ గడ్డపైనే జరగనుంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరగనున్న ఈ తొలిపోరుకు ముందు ఆరంభ వేడుక జరగాల్సి ఉంది. ఏటా ప్రతి సీజన్కు ముందు డిఫెండింగ్ చాంపియన్స్ సొంత గడ్డపైనే వేడుకలు చేయడం ఆనవాయితీ.
Read Also:ఆ ముగ్గురిలో : ధోనీ తర్వాత సూపర్ కింగ్స్కి కెప్టెన్?
ఈ వేడుకలలో ప్రముఖ సినీ తారలు కనువిందు చేస్తుంటారు. కానీ, ఈ సారి ఆరంభ వేడుకలేవీ లేవని తేల్చి చెప్పారు క్రికెట్ నియమ పాలకుల కమిటీ(సీఓఏ) చీఫ్ వినోద్ రాయ్. ఫిబ్రవరి 14న జరిగిన ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల గురించే వేడుకను ఆపి వేయనున్నట్లు ప్రకటించారు.
ఓ మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. ఐపీఎల్ ఆరంభ వేడుకలు జరపకూడదని నిర్ణయం తీసుకున్నాం. దానికి అయ్యే ఖర్చును పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు ఇవ్వాలనుకుంటున్నాం’ అని వెల్లడించారు.
Read Also:అదే కారణమా : హార్దిక్ పాండ్యా ఐపీఎల్కు కూడా దూరమే