ఇండియా టూర్‌కి ఆస్ట్రేలియా టీమ్ ఇదే: మాక్స్‌వెల్ అవుట్.. మార్నస్ ఇన్!

  • Published By: vamsi ,Published On : December 17, 2019 / 06:41 AM IST
ఇండియా టూర్‌కి ఆస్ట్రేలియా టీమ్ ఇదే: మాక్స్‌వెల్ అవుట్.. మార్నస్ ఇన్!

Updated On : December 17, 2019 / 6:41 AM IST

భారత్‌తో 2020 జనవరి 14వ తేదీ నుంచి జరగనున్న మూడు వన్డేల సిరీస్‌ కోసం 14 మందితో కూడిన జట్టుని ప్రకటించింది  ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు. హిట్టర్ మాక్స్‌వెల్, ఉస్మాన్ ఖవాజా, షాన్ మార్ష్, నాథన్ లయన్, కౌల్టర్ నైల్‌ తదితర క్రికెటర్లని పక్కన పెట్టిన క్రికెట్ ఆస్ట్రేలియా.. ఇటీవల టెస్టుల్లో సంచలన ఇన్నింగ్స్‌లు ఆడిన మార్కస్ లబుషేన్‌కి వన్డే టీమ్‌లో చోటు ఇచ్చింది.

ఆస్ట్రేలియా వన్డే జట్టు: ఆరోన్ ఫించ్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, స్టీవ్‌స్మిత్, మిచెల్ స్టార్క్, అస్టన్ టర్నర్, ఆడమ్ జంపా, సీన్ అబాట్, అస్గన్ అగర్, అలెక్స్ క్యారీ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్ (వైస్ కెప్టెన్), పీటర్ హ్యాండ్స్‌కబ్, జోష్ హేజిల్‌వుడ్, మార్కస్ లబుషేన్, కేన్ రిచర్డ్‌సన్

తొలి వన్డే మ్యాచ్‌ ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా జనవరి 14న జరగనుంది.  ఆ తర్వాత 17న రాజ్‌కోట్ వేదికగా రెండో వన్డే, 19న బెంగళూరు వేదికగా మూడో వన్డే జరగనుంది. గాయం కారణంగా జేసన్ బెరండ్రాఫ్‌ టీమ్‌కి దూరమవగా.. టెస్టు కెప్టెన్‌గా ఉన్న అలెక్స్ క్యారీకి వన్డేల్లో వికెట్‌ కీపర్‌గా అవకాశం దక్కింది.  

బిజీ షెడ్యూల్ కారణంగా తనకి విశ్రాంతి కావాలని హిట్టర్ మాక్స్‌వెల్ ముందుగానే బోర్డుని కోరగా అతని అభ్యర్థన మేరకు విశ్రాంతి ఇచ్చింది బోర్డు. షాన్ మార్ష్, నాథన్ లయన్, స్టాయినిస్‌ని పేలవ ఫామ్‌ కారణంగా పక్కన పెట్టినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం వెస్టిండీస్‌తో వన్డేలు ఆడుతున్న భారత్ జనవరిలో మ్యాచ్‌లు ఆడనుంది.