ODI World Cup 2023 : రోహిత్ సేన ఎంత పని చేసింది..? పాకిస్థాన్ నటి డేటింగ్ మిస్.. అమ్మడు ఇప్పుడేమందో తెలుసా..?
వన్డే ప్రపంచకప్లో భారత్ విజయయాత్ర కొనసాగుతోంది. వరుసగా నాలుగు మ్యాచుల్లోనూ గెలుపొందింది.
![ODI World Cup 2023 : రోహిత్ సేన ఎంత పని చేసింది..? పాకిస్థాన్ నటి డేటింగ్ మిస్.. అమ్మడు ఇప్పుడేమందో తెలుసా..? ODI World Cup 2023 : రోహిత్ సేన ఎంత పని చేసింది..? పాకిస్థాన్ నటి డేటింగ్ మిస్.. అమ్మడు ఇప్పుడేమందో తెలుసా..?](https://10tv.in/wp-content/uploads/2023/10/New-Project-9-7.jpg)
Pakistan actress Sehar Shinwari
Sehar Shinwari Responds on Dinner Date : వన్డే ప్రపంచకప్లో భారత్ విజయయాత్ర కొనసాగుతోంది. వరుసగా నాలుగు మ్యాచుల్లోనూ గెలుపొందింది. గురువారం పూణె వేదికగా జరిగిన మ్యాచ్లో బంగ్లాదేశ్ను ఏడు వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఇండియా గెలవడంతో ఇప్పుడు అందరి దృష్టి పాకిస్థాన్ నటి సెహర్ షిన్వారీ పై పడింది. ఎందుకంటే ఈ భామ మ్యాచ్కు ముందు చేసిన కామెంట్లే అందుకు కారణం.
అహ్మదాబాద్లో పాకిస్థాన్ను ఘోరంగా ఓడించింది భారత్. ఈ ఓటమిని పాకిస్థాన్ అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. ఈ క్రమంలో సెహర్ షిన్వారీ సోషల్ మీడియాలో ఇలా రాసుకొచ్చింది. ‘మన ఓటమికి ప్రతీకారం బంగ్లా బంధు తీర్చుకుంటారు. వారు భారత్ను ఓడిస్తే.. నేను ఢాకా వెళ్లి బంగ్లా అబ్బాయితో కలిసి చేప వంటకాలతో కూడిన డిన్నర్ డేట్ చేస్తాను.’ అంటూ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ వైరల్గా మారింది.
InshAllah my Bangali Bandu will avenge us in the next match. I will go to dhaka and have a fish dinner date with Bangali boy if their team managed to beat India ✌️❤️ 🇧🇩
— Sehar Shinwari (@SeharShinwari) October 15, 2023
Virat Kohli: రికార్డులే రికార్డులు.. కోహ్లి అందుకే ఎమోషన్ అయ్యాడా?
కట్ చేస్తే.. భారత్ చేతిలో బంగ్లాదేశ్ చిత్తుగా ఓడడంతో ఇప్పుడు అందరి దృష్టి ఈ పాక్ నటిపై పడింది. నీ కోరిక తీరలేదు. ఇప్పుడు ఏం చేస్తావ్ అని పలువురు ఆమెను ప్రశ్నించారు. “బాగా ఆడారు బంగ్లా టైగర్స్. కనీసం మీరు ఇండియన్ టీమ్ను వారి సొంత గడ్డపై ఛాలెంజ్ చేశారు.” అంటూ సదరు నటి పోస్ట్ చేసింది. దీనిపై నెటీజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఆశ ఉండాలి గానీ.. అత్యాశ ఉండకూడదు అని ఒకరు అనగా.. పక్కొడి కొంప కూల్చాలని ప్రయత్నిస్తే మన కొంప కూలడం ఖాయం. టీమ్ఇండియాతో పెట్టుకోకు ఈ జన్మలో డేట్కు వెళ్లలేవు అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.
Well played Bengali Tigers. At least you guys challanged Indian team on their home ground.👏😊
— Sehar Shinwari (@SeharShinwari) October 19, 2023
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 256 పరుగులు చేసింది. లిటన్ దాస్ (66), తాంజిద్ హసన్ (51) హాఫ్ సెంచరీ చేశారు. టీమ్ఇండియా బౌలర్లలో జస్ ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజాలు తలా రెండు వికెట్లు పడగొట్టారు. శార్దూల్ థాకూర్, కుల్దీప్ యాదవ్ ఒక్కొ వికెట్ తీశారు. లక్ష్యాన్ని భారత్ 41.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లీ (103 నాటౌట్; 97 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సులు) శతకంతో చెలరేగిపోయాడు.