ICC World Cup 2023 : ఐసీసీ ప్రపంచ కప్ విజేతకు కనకవర్షమే

ఐసీసీ ప్రపంచ కప్ విజేతకు కనకవర్షం కురవనుంది. ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 2023 క్రికెట్ టోర్నమెంట్‌లో భారత్- ఆస్ట్రేలియా మధ్య ఆదివారం అహ్మదాబాద్‌లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో విజేత జట్టుకు భారీ ఎత్తున నగదు బహుమతి లభించనుంది.....

ICC World Cup 2023 : ఐసీసీ ప్రపంచ కప్ విజేతకు కనకవర్షమే

India vs Australia ICC World Cup

Updated On : November 19, 2023 / 6:08 AM IST

ICC World Cup 2023 : ఐసీసీ ప్రపంచ కప్ విజేతకు కనకవర్షం కురవనుంది. ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 2023 క్రికెట్ టోర్నమెంట్‌లో భారత్- ఆస్ట్రేలియా మధ్య ఆదివారం అహ్మదాబాద్‌లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో విజేత జట్టుకు భారీ ఎత్తున నగదు బహుమతి లభించనుంది. ప్రపంచ క్రికెట్ కప్ గెలుపొందిన జట్టుకు రూ.33 కోట్లు, రన్నరప్‌గా నిలిచిన జట్టుకు 16.64 కోట్ల రూపాయల బహుమతిని అందజేయనున్నారు.

అన్ని జట్లకు ప్రైజ్ మనీ

ప్రపంచకప్‌లో ఆడిన మిగతా అన్ని జట్లకు కూడా ప్రతిఫలం లభిస్తోంది. గతంలో ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాపై ఓటమికి టీమిండియాకు ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉంది. సెమీఫైనల్‌లో ఓడిన రెండు జట్లకు ఒక్కొక్కరికి రూ.6.65 కోట్లు లభిస్తాయి. గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లలో ఓడిన మిగతా ఆరు జట్లకు ఒక్కొక్కరికి రూ.83 లక్షలు బహుమతిగా అందజేస్తారు. ఇంగ్లండ్, పాకిస్థాన్, శ్రీలంక, అఫ్ఘానిస్థాన్, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ దేశాల జట్లు రూ.5 కోట్లు చొప్పున అందుకోనున్నాయి.

అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌కు గోల్డెన్ బ్యాట్

గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లలో గెలిచిన జట్టుకు వారు గెలిచిన ప్రతి మ్యాచ్‌కు రూ.33 లక్షలు చొప్పున ఇస్తారు. అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌కు గోల్డెన్ బ్యాట్, అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌కు గోల్డెన్ బాల్‌ను అందజేస్తారు. ఫైనల్ మ్యాచ్‌ను చూసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ,ఆస్ట్రేలియా ఉప ప్రధాని రిచర్డ్ మార్లెస్ కూడా అహ్మదాబాద్ వచ్చే అవకాశం ఉంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఫైనల్ మ్యాచ్‌కు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నారు.

ALSO READ : India vs Australia Cricket World Cup Final : భారత్-ఆస్ట్రేలియా క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్‌కు భారీ భద్రత

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ప్రపంచ కప్ విజేతలకు బహుమతులను ప్రకటించింది. ఈ ప్రపంచకప్ పోటీల్లో పాల్గొనే 10 దేశాల క్రికెట్ జట్లకు రూ.83కోట్లరూపాయలను ప్రైజ్ మనీగా అందజేస్తారు. గత ఏడాది 2022 ఫుట్ బాల్ వరల్డ్ కప్ మ్యాచ్ సందర్భంగా 440 మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీని అందించారు. ఫుట్ బాల్ ఛాంపియన్ అర్జెంటీనా జట్టుకు రూ.350 కోట్ల రూపాయలు, రన్నరప్ గా నిలిచిన ఫ్రాన్స్ జట్టుకు 30 మిలియన్ డాలర్లను అందజేశారు.