IPL 2024 : స్టేడియంలో కొట్టుకుంది రోహిత్, హార్ధిక్ ఫ్యాన్సేనా..! అసలు విషయం ఏమిటంటే? వీడియో వైరల్

హార్ధిక్ పాండ్యా ముంబై జట్టు పగ్గాలు చేపట్టిన తరువాత తొలి మ్యాచ్ ఆదివారం ఆడింది. ఈ మ్యాచ్ ప్రారంభమైన దగ్గర నుంచి స్టేడియంలో ..

IPL 2024 : స్టేడియంలో కొట్టుకుంది రోహిత్, హార్ధిక్ ఫ్యాన్సేనా..! అసలు విషయం ఏమిటంటే? వీడియో వైరల్

IPL 2024 MI vs GT Match

Rohit and Hardik Pandya Fans Fight : ఐపీఎల్ – 2024 టోర్నీలో మ్యాచ్ ల మధ్య పోరు రసవత్తరంగా మారుతోంది. చివరి వరకు ఇరు జట్లతో విజయం దోబూచులాడుతుండటంతో ఉత్కంఠ భరితంగా మారుతున్నాయి. ఆదివారం రాత్రి అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ జట్లు ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది. ముంబై జట్టు కెప్టెన్ గా రోహిత్ శర్మను యాజమాన్యం తప్పించిన విషయం తెలిసిందే.. రోహిత్ స్థానంలో హార్దిక్ పాండ్యా జట్టు పగ్గాలు అందుకున్నాడు. రోహిత్ ను కెప్టెన్సీ నుంచి తప్పించడంపై రోహిత్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో గత రెండు నెలలుగా పాండ్యా పై రోహిత్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడుతున్నారు.

Also Read : బుమ్రా ఎక్కడ? హార్ధిక్ పాండ్యా నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టిన కేవిన్ పిటర్సన్, సునీల్ గవాస్కర్

హార్ధిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ జట్టు పగ్గాలు చేపట్టిన తరువాత తొలి మ్యాచ్ ఆదివారం నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్ ప్రారంభం నుంచి స్టేడియంలో అభిమానులు రోహిత్ శర్మ నామస్మరణ చేశారు. రోహిత్ ఫీల్డింగ్, బ్యాటింగ్ చేస్తున్నంత సేపు రోహిత్.. రోహిత్ అంటూ అభిమానులు పెద్దెత్తున నినాదాలు చేశారు. అయితే, మ్యాచ్ జరుగుతుండగా స్టేడియంలో ప్రేక్షకుల మధ్య ఘర్షణ జరిగింది.  ముగ్గురు నలుగురు వ్యక్తులు కొట్టుకున్నారు. దీంతో స్టేడియంలో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అయితే, కొట్టుకుంది రోహిత్, హార్దిక్ పాండ్యా ఫ్యాన్స్ అని ప్రచారం జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Also Read : IPL 2024 : ముంబై ఇండియన్స్ ఓటమి తరువాత హార్దిక్ పై రోహిత్ ఆగ్రహం.. ఆకాశ్ అంబానీ ఏం చేశారంటే?

ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగే సందర్భంలో స్టేడియంలో గొడవ పడింది రోహిత్, హార్ధిక్ పాండ్యా ఫ్యాన్స్ కాదట. కేవలం ప్రేక్షకుల మధ్య చిన్న విషయంపై తలెత్తిన మాటల యుద్ధం గొడవకు దారితీసిందని తెలుస్తోంది. మొత్తానికి స్టేడియంలో ప్రేక్షకుల మధ్య కొట్లాటకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.