Suresh Raina: రైనా, ఓజాకు ధోని విందు.. సాక్షి వెరైటీ ఎక్స్ప్రెషన్ వైరల్
సురేశ్, రైనా, ప్రజ్ఞాన్ ఓజాకు ఎంఎస్ ధోని తన ఇంట్లో విందు ఇచ్చాడు. ఈ సందర్భంగా రైనాతో ధోని, సాక్షి దంపతులు దిగిన ఫొటోలు వైరల్ గా మారాయి.
Suresh Raina, Dhoni : అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయినప్పటికీ టీమిండియా మాజీ కెప్టన్ మహేంద్ర సింగ్ ధోని క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అతడు ఎక్కడ కనిపించినా, ఏం చేస్తున్నా ఫ్యాన్స్ ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇటీవల ముగిసిన వన్డే ప్రపంచకప్ ధోని అభిమానులకు మాత్రం నిరాశ మిగిల్చింది. ఎందుకంటే అతడు ఎక్కడా కనబడలేదు. కానీ అతడు నటించిన వాణిజ్య ప్రకటనలు మాత్రం టీవీల్లో సందడి చేశాయి. అప్పడప్పుడు సోషల్ మీడియా ద్వారా ధోనికి సంబంధించిన సంగతులు తెలుస్తున్నాయి.
అహ్మదాబాద్ లో గత ఆదివారం జరిగిన వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ కు ధోని వస్తాడని అభిమానులను ఎదురు చూశారు. గతంలో వరల్డ్ కప్ గెలిచిన విన్నింగ్ కెప్టెన్లను ఫైనల్ మ్యాచ్ కు ఐసీసీ, బీసీసీఐ ఆహ్వానించినట్టు వార్తలు రావడంతో.. మహి తప్పకుండా వస్తాడని అంతా అనుకున్నారు. కానీ ధోని తన పూర్వీకుల గ్రామంలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. తాజాగా సురేశ్, రైనా, ప్రజ్ఞాన్ ఓజాకు ధోని తన ఇంట్లో విందు ఇచ్చాడు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
తమకు చక్కటి విందు ఇచ్చిన ధోనికి ధన్యవాదాలు చెబుతూ రైనా, ప్రజ్ఞాన్ ఓజా ఇన్స్టాగ్రామ్లో ఫొటోలు షేర్ చేశారు. తనతో పాటు ధోని, సాక్షి దంపతులు దిగిన ఫొటోను రైనా ఇన్స్టాగ్రామ్లో పెట్టాడు. ఈ ఫొటోలో ధోని భార్య సాక్షి వెరైటీ ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. దీనిపై నెటిజనులు సరదాగా స్పందిస్తూ కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి ఏదో రకంగా ధోని కనిపించినందుకు అతడి అభిమానులు మాత్రం ఖుషీ అవుతున్నారు. కాగా, వచ్చే ఏడాది ఐపీఎల్ ధోని ఆడాలని అతడి ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
View this post on Instagram
Also Read: మాజీ పాక్ ప్లేయర్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మహ్మద్ షమీ
View this post on Instagram