Virat Kohli : విరాట్ కోహ్లికి బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ.. టీ20 ప్రపంచకప్ ‘టోర్నమెంట్ ఆఫ్ ది టీమ్’ ఇదే..
పొట్టి ప్రపంచకప్లో సత్తా చాటిన అత్యుత్తమ ప్లేయర్లతో కూడిన జట్టును ఐసీసీ ప్రకటించింది.
![Virat Kohli : విరాట్ కోహ్లికి బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ.. టీ20 ప్రపంచకప్ ‘టోర్నమెంట్ ఆఫ్ ది టీమ్’ ఇదే.. Virat Kohli : విరాట్ కోహ్లికి బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ.. టీ20 ప్రపంచకప్ ‘టోర్నమెంట్ ఆఫ్ ది టీమ్’ ఇదే..](https://10tv.in/wp-content/uploads/2024/07/Virat-Kohli.jpg)
Virat Kohli
టీ20 ప్రపంచకప్ విజేతగా భారత జట్టు నిలిచింది. బార్బడోస్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచులో భారత్ 7 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. ఇక ఈ పొట్టి ప్రపంచకప్లో సత్తా చాటిన అత్యుత్తమ ప్లేయర్లతో కూడిన జట్టును అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రకటించింది. ఈ జట్టులో 6 గురు భారత ఆటగాళ్లకు చోటు దక్కింది. సంచలన ప్రదర్శనతో సెమీఫైనల్కు చేరిన అఫ్గాన్ జట్టు నుంచి ముగ్గురు ఆటగాళ్లకి ఛాన్స్ ఇచ్చింది.
ఇక ఫైనల్లో భారత్ చేతిలో ఓడి రన్నరప్గా నిలిచిన దక్షిణాఫ్రికా జట్టు నుంచి ఒకే ఒక్క ఆటగాడికి అవకాశం ఇచ్చింది. అది కూడా 12వ ఆటగాడిగా ఎంపిక చేసింది. ఆస్ట్రేలియా, వెస్టిండీస్ నుంచి ఒక్కొ ఆటగాడిని తీసుకుంది.
IND-W vs SA-W : పాపం దక్షిణాఫ్రికా.. మొన్న అబ్బాయిలు.. నేడు అమ్మాయిలు..
భారత్ నుంచి బ్యాటర్ల జాబితాలో రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, ఆల్రౌండర్ల కోటా నుంచి హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్ లు ఉన్నారు. బౌలర్ల జాబితా నుంచి జస్ ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్ లు స్థానం సంపాదించుకున్నారు. ఇక అఫ్గానిస్తాన్ జట్టు నుంచి రహ్మనుల్లా గుర్బాజ్, రషీద్ ఖాన్, ఫజల్ హక్ ఫరూఖీ లకు ఛాన్స్ ఇచ్చింది. ఆస్ట్రేలియా నుంచి మార్కస్ స్టాయినిస్, వెస్టెండీస్ నుంచి నికోలస్ పూరన్ లను ఎంపిక చేసింది. దక్షిణాఫ్రికా నుంచి అన్రిచ్ నోర్జే ను 12వ ప్లేయర్గా తీసుకుంది.
ఐసీసీ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ జట్టు ఇదే..
రోహిత్ శర్మ, రహ్మనుల్లా గుర్బాజ్, నికోలస్ పూరన్, సూర్యకుమార్ యాదవ్, మార్కస్ స్టొయినిస్, హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, రషీద్ ఖాన్, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, ఫజల్లా ఫరూకీ.
Team India : టీ20 ప్రపంచకప్ పూర్తైనా.. టీమ్ఇండియాను వదలని వరణుడు.. ఎప్పుడొస్తారో..?