Smriti Mandhana : చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన.. వరుసగా రెండు వన్డేల్లోనూ శతకాలు.. ఏకైక భారత ప్లేయర్..
టీమ్ఇండియా మహిళా క్రికెటర్ స్మృతి మంధాన అరుదైన ఘనత సాధించింది.
![Smriti Mandhana : చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన.. వరుసగా రెండు వన్డేల్లోనూ శతకాలు.. ఏకైక భారత ప్లేయర్.. Smriti Mandhana : చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన.. వరుసగా రెండు వన్డేల్లోనూ శతకాలు.. ఏకైక భారత ప్లేయర్..](https://10tv.in/wp-content/uploads/2024/06/Smriti-Mandhana-consecutive-ODI-centuries.jpg)
Smriti Mandhana consecutive ODI centuries
Smriti Mandhana consecutive ODI centuries : టీమ్ఇండియా మహిళా క్రికెటర్ స్మృతి మంధాన అరుదైన ఘనత సాధించింది. మహిళల వన్డే క్రికెట్లో వరుసగా రెండు మ్యాచుల్లోనూ శతకాలు చేసిన భారత ప్లేయర్గా చరిత్ర సృష్టించింది. బెంగళూరు వేదికగా దక్షిణాఫ్రికాతో రెండో వన్డేలో సెంచరీ చేయడంతో మంధాన ఈ రికార్డును అందుకుంది. తొలి వన్డేలోనూ (117) సెంచరీ చేసింది.
దక్షిణాఫ్రికా జట్టు భారత పర్యటనకు వచ్చింది. బెంగళూరు వేదికగా మూడు వన్డేల సిరీస్ జరుగుతోంది. తొలి వన్డేలో భారత మహిళలు 143 పరుగుల తేడాతో గెలిచారు. ఇక రెండో వన్డే బుధవారం జరుగుతోంది. ఈ మ్యాచ్లో టాస్ ఓడిన భారత జట్టు బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 325 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ స్మృతి మంధాన (136; 120 బంతుల్లో 18 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (103 నాటౌట్; 88 బంతుల్లో 9 ఫోర్లు, 3సిక్సర్లు) శతకాలతో చెలరేగారు. షఫాలీ వర్మ(20), హేమలత (24) లు సైతం రాణించారు.
T20 World Cup 2024 : రోహిత్తో గొడవ.. బంగ్లాదేశ్ యువ పేసర్ కి ఐసీసీ జరిమానా..
కాగా.. వన్డేల్లో స్మృతి మంధానకు ఇది ఏడో సెంచరీ కావడం గమనార్హం. ఈ క్రమంలో టీమ్ఇండియా తరుపున వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్గా ఉన్న మిథాలీ రాజ్ రికార్డును మంధాన సమం చేసింది. మిథాలీ రాజ్ 211 వన్డే ఇన్నింగ్స్ల్లో 7 శతకాలు బాదగా.. స్మృతి మంధాన 84 ఇన్నింగ్స్ల్లోనే ఈ ఘనతను అందుకుంది. వీరి తరువాత స్థానాల్లో హర్మన్ ప్రీత్ కౌర్, పూనమ్ రౌత్ లు ఉన్నారు.
మహిళల క్రికెట్లో వన్డేల్లో భారత్ తరుపున అత్యధిక శతకాలు ..
స్మృతి మంధాన – 84 ఇన్నింగ్స్ల్లో 7 శతకాలు
మిథాలీ రాజ్ – 211 ఇన్నింగ్స్ల్లో 7 సెంచరీలు
హర్మన్ ప్రీత్ కౌర్ – 113 ఇన్నింగ్స్ల్లో 5 సెంచరీలు
పూనమ్ రౌత్ – 73 ఇన్నింగ్స్ల్లో 3 సెంచరీలు
తిరుష్ కామిని – 37 ఇన్నింగ్స్ల్లో 2 శతకాలు
కాగా.. నేటి మ్యాచ్లో మంధాన చేసిన స్కోరు ఆమె వన్డే కెరీర్లో అత్యధిక స్కోరు కావడం విశేషం.
Smriti Mandhana – the first ever Indian player to score back to back centuries in the WODIs. pic.twitter.com/VK0vcwhYWu
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 19, 2024