Rajasthan Royals : బెంగళూరుతో మ్యాచ్.. స్పెషల్ ‘పింక్’ కలర్ జెర్సీతో బరిలోకి దిగనున్న రాజస్థాన్.. కారణం తెలిస్తే..
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా శనివారం రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి.
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా శనివారం రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియం ఈ మ్యాచ్కు వేదిక కానుంది. ఇక ఈ మ్యాచ్కు ఓ విశేషం ఉంది. రాజస్థాన్ తమ రెగ్యులర్ జెర్సీతో కాకుండా పూర్తి పింక్ కలర్ జెర్సీతో బరిలోకి దిగనుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది.
వాస్తవానికి రాజస్థాన్ జెర్సీ కలర్ కూడా పింక్ కలరే. అయితే.. పింక్తో పాటు కొన్ని రంగులు కలిసి ఉంటాయి. అయితే.. నేటి మ్యాచ్ కోసం మాత్రం పూర్తి పింక్ కలర్ జెర్సీని ధరించనుంది. #PinkPromise మిషన్ కింద రాజస్థాన్ ఆడుతున్న మ్యాచ్ ఇది. మహిళల సాధికారత ఈ మిషన్ లక్ష్యం. మహిళల అభ్యున్నతికి కోసం అంకితం చేశారు.
ఇక ఈ మ్యాచ్ కు విక్రయించే ప్రతి టికెట్ నుంచి రూ.100 మహిళల అభివృద్ధికి విరాళంగా ఇవ్వనున్నారు. అంతేకాదండోయ్ ఈ మ్యాచ్లో కొట్టే ఒక్కో సిక్స్ ద్వారా రాజస్థాన్లోని ఆరు ళ్లకు సౌరశక్తిని అందించనున్నారు. టికెట్లను విక్రయించడం ద్వారా వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని రాయల్ రాజస్థాన్ ఫౌండేషన్కు వెళ్లనుంది.
Tonight, we’re walking out to play for the women of Rajasthan… 💗#PinkPromise pic.twitter.com/ZPulqvGBI5
— Rajasthan Royals (@rajasthanroyals) April 6, 2024
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ సీజన్లో మూడు మ్యాచులు ఆడిన రాజస్థాన్ అన్ని మ్యాచుల్లోనూ విజయం సాధించింది. ఈ మ్యాచ్లోనూ గెలిచి విజయపరంపర కొనసాగించాలని చూస్తోంది. అటు బెంగళూరు జట్టు పరిస్థితి భిన్నంగా ఉంది. నాలుగు మ్యాచులు ఆడగా కేవలం ఒక్క మ్యాచ్లోనే గెలుపొందింది. ఈ మ్యాచ్లోనూ ఓడిపోతే.. బెంగళూరు ప్లే ఆఫ్స్ అవకాశాలు కష్టం అవుతాయి.
ఐపీఎల్ చరిత్రలో ఈ రెండు జట్లు ఇప్పటి వరకు 30 సందర్భాల్లో ముఖాముఖిగా తలపడ్డాయి. 15 మ్యాచుల్లో బెంగళూరు గెలవగా 12 మ్యాచుల్లో రాజస్థాన్ విజయం సాధించింది. మూడు మ్యాచుల్లో ఫలితం తేలలేదు.