India vs Pakistan: మహిళా టీ20 వరల్డ్ కప్.. ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్
మ్యాచ్కు సంబంధించి పాకిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దాయాది జట్ల మధ్య మ్యాచ్ అంటే రెండు దేశాల్లోనే కాకుండా, ఇతర దేశాల క్రికెట్ అభిమానుల్లోనూ అమితాసక్తి ఉంటుంది. అందుకే ఈ మ్యాచ్ ఇరు జట్లకూ కీలకంగా మారింది.
India vs Pakistan: ‘ఐసీసీ మహిళా టీ20 వరల్డ్ కప్-2023’లో భాగంగా ఆదివారం ఇండియా-పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికాలో జరుగుతున్న ఈ సిరీస్లో ఇండియా తన తొలి మ్యాచ్ పాకిస్తాన్తో ఆడుతోంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 06.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది.
మ్యాచ్కు సంబంధించి పాకిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దాయాది జట్ల మధ్య మ్యాచ్ అంటే రెండు దేశాల్లోనే కాకుండా, ఇతర దేశాల క్రికెట్ అభిమానుల్లోనూ అమితాసక్తి ఉంటుంది. అందుకే ఈ మ్యాచ్ ఇరు జట్లకూ కీలకంగా మారింది. భారత జట్టుకు హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్గా వ్యవహరిస్తుండగా, పాక్ జట్టుకు బిస్మా మరూఫ్ కెప్టెన్గా వ్యవహరిస్తోంది. టీమిండియాకు సంబంధించి కీలక ప్లేయర్గా ఉన్న స్మృతి మంధాన గాయం కారణంగా ఈ మ్యాచ్లో బెంచ్కే పరిమితం కానుంది. భారత తుది జట్టు: షెఫాలి వర్మ, యస్తికా భాటియా, రోడ్రిగస్, హర్లీన్, హర్మన్ ప్రీత్ కౌర్, రిచా ఘోష్, దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, రేణుకా ఠాకూర్ సింగ్.