తెలంగాణలో కొత్తగా 1,764 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనేవుంది. రోజు రోజుకు పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనేవుంది. రాష్ట్రంలో కొత్తగా 1,764 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇవాళ కరోనా బారిన పడి 12 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో 492 మంది మృతి చెందారు.
ఇప్పటివరకు రాష్ట్రంలో 58,906 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. వీరిలో 43,751 మంది కోలుకుని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరో 14,663 మంది బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. నిన్న ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 18,858 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 3,97,939 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని అధికారులు తెలిపారు.
జీహెచ్ఎంసీలో అత్యధికంగా మరో 509 కేసులు నమోదయ్యాయి. మేడ్చల్ 158, రంగారెడ్డి 147, వరంగల్ అర్బన్ 138, కరీంనగర్ 93, సంగారెడ్డి 89, ఖమ్మం 69, నల్గొండ 51, నిజామాబాద్లో 47 కేసులు నమోదు అయ్యాయి.
మహబూబ్నగర్ 47, పెద్దపల్లి 44, వరంగల్ రూరల్ 41, సూర్యపేట 38, భద్రాది కొత్తగూడెం 30, నాగర్కర్నూలు 29, మంచిర్యాల 28 కేసులు నమోదు అయ్యాయి.