తెల్లవారుజామున 5గంటలకు జరిగిన ఎన్ కౌంటర్ పై ఒవైసీ సంచలన ట్వీట్
ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఇటీవల జరిగిన ఎన్ కౌంటర్ పై సంచలన ట్వీట్ చేశారు. ఎన్ కౌంటర్ ను ఒవైసీ తప్పుపట్టారు. తెల్లవారుజామున 5గంటలకు ఎన్ కౌంటర్ల పేరుతో

ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఇటీవల జరిగిన ఎన్ కౌంటర్ పై సంచలన ట్వీట్ చేశారు. ఎన్ కౌంటర్ ను ఒవైసీ తప్పుపట్టారు. తెల్లవారుజామున 5గంటలకు ఎన్ కౌంటర్ల పేరుతో
ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఇటీవల జరిగిన ఎన్ కౌంటర్ పై సంచలన ట్వీట్ చేశారు. ఎన్ కౌంటర్ ను ఒవైసీ తప్పుపట్టారు. తెల్లవారుజామున 5గంటలకు ఎన్ కౌంటర్ల పేరుతో చంపడం కరెక్ట్ కాదన్నారు. అరెస్ట్ చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగం చేసి ఉండొచ్చు అన్నారు. కానీ ఎన్ కౌంటర్లు చేయడం దారుణం అన్నారు. సీపీ సాబ్.. కడుపులో బుల్లెట్లు దించొద్దు, ఉగ్రవాదానికి మతం లేదు..” అని ఒవైసీ ట్వీట్ చేశారు. సైబరాబాద్ సీపీ సజ్జనార్ ను టార్గెట్ చేస్తూ ఒవైసీ ఈ ట్వీట్ చేశారు.
@cpcybd sir whatever you do but no killings in name of “encounter” at 05am please, if possible arrest & as accepted 3rd degree will be given but pls no cartoos in stomach
CP saheb Terrorism has no religion, (remember NGodse) https://t.co/uEMhF7Or2v— Asaduddin Owaisi (@asadowaisi) January 8, 2020
ట్విట్టర్ వేదికగా సైబరాబాద్ సీపీ సజ్జనార్ , ఒవైసీ మధ్య వార్ నడుస్తోంది. ఈ ఇద్దరి మధ్య వివాదానికి కారణం ఓ నెటిజన్ చేసిన ట్వీట్. హైదరాబాద్ లోని అమెరికన్ సాఫ్ట్ వేర్ కంపెనీల్లో జిహాదీలు పని చేస్తున్నారా? వారి సమాచారం మీ దగ్గర ఏమైనా ఉందా? మీరు ఏ విధంగా నిఘా పెట్టారు? అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల తరుణంలో.. సురేష్ అనే వ్యక్తి హైదరాబాద్ పోలీసులను ప్రశ్నిస్తూ ఈ ట్వీట్ చేశాడు. దీనికి సైబరాబాద్ పోలీసులు రిప్లయ్ ఇచ్చారు.
Many wannabe Jihadis work for American Software companies in Hyderabad? After #Iran threatened to hit US assets, has @hydcitypolice @cyberabadpolice @RachakondaCop done background check/risk assessment of these Peacefuls? Or cops are clueless? @KTRTRS @TelanganaDGP @USCGHyderabad
— Suresh Kochattil (@kochattil) January 6, 2020
”ఎస్ సార్. ఉగ్రవాదుల సమాచార సేకరణకు మా దగ్గర ప్రత్యేక వ్యవస్థ ఉంది. మమ్మల్ని అలర్ట్ చేసినందుకు థ్యాంక్స్. ఏదైనా అనుమానాస్పదంగా అనిపిస్తే మాకు తెలపండి” అంటూ సైబరాబాద్ పోలీసులు స్పందించారు.
Yes sir… We have specialised wings for collection of advance intel and our teams are on the job 24X7. Thanks for alerting us. Please keep us updated if you find anything suspicious.
— Cyberabad Police (@cyberabadpolice) January 6, 2020
ఈ ట్వీట్.. ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి తీవ్రమైన కోపం తెప్పించింది. వెంటనే సైబరాబాద్ సీపీపై ప్రశ్నల వర్షం కురిపించారు. హైదరాబాద్ లోని అమెరికన్ సాఫ్ట్ వేర్ కంపెనీల్లో ఎంతమంది జిహాదీలు ఉన్నారో చెప్పండి అని సైబరాబాద్ సీపీని అడిగారు. వాళ్ల సమాచారం మీ దగ్గర ఉందా? ఏ కంపెనీలో జిహాదీలు పని చేస్తున్నారు? అని నిలదీశారు. సీపీ సాబ్.. ఉగ్రవాదానికి మతం లేదు” అంటూ ట్వీట్ చేశారు. భక్తులకు మాత్రమే సమాధానం ఇస్తారా లేక ఓ ఎంపీకి కూడా బదులిస్తారా అని ఒవైసీ అడిగారు. అంతటితో ఆగని ఒవైసీ.. ఎన్ కౌంటర్ అంశాన్ని టచ్ చేశారు. ఎన్ కౌంటర్ తప్పు అనే విధంగా మాట్లాడారు.
@cpcybd sir you say “yes sir” please enlighten how many such “jihadi” are working in software companies kindly give a number if not please clarify what you exactly meant
Will you reply to an MP or only to a Bhakt? https://t.co/uEMhF7Or2v— Asaduddin Owaisi (@asadowaisi) January 8, 2020
సైబరాబాద్ సీపీకి ఒవైసీ ప్రశ్నలు:
* హైదరాబాద్ లోని సాఫ్ట్ వేర్ కంపెనీల్లో నిజంగా జిహాదీలు ఉన్నారా?
* సైబరాబాద్ లో ఎంతమంది జిహాదీలు ఉన్నారు? వారు ఏ కంపెనీలో పని చేస్తున్నారు?
* మీ దగ్గర జిహాదీల వివరాలు ఉంటే ఇవ్వండి
* జిహాదీలను గుర్తిస్తే అరెస్ట్ చేయండి.. కానీ ఎన్ కౌంటర్ చేయొద్దు
* ఉగ్రవాదానికి, మతానికి లింక్ పెట్టొద్దు
* ఎన్ కౌంటర్ పేరుతో చంపడం కరెక్ట్ కాదు
* ఉదయం 5గంటలకు ఎన్ కౌంటర్ చేయడం, బుల్లెట్లను కడుపులో దింపడం సరికాదు