Bandi Sanjay : కాంగ్రెస్‌కి గురువు కేసీఆర్, ఇద్దరూ కలిసి డ్రామాలు ఆడుతున్నారు- బండి సంజయ్

రైతుల విషయంలో ఆందోళన చేసే అధికారం కేసీఆర్ కు లేదు. కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో పంటలు నష్టపోతే ఎందుకు పర్యటించ లేదు?

Bandi Sanjay : కాంగ్రెస్‌కి గురువు కేసీఆర్, ఇద్దరూ కలిసి డ్రామాలు ఆడుతున్నారు- బండి సంజయ్

Bandi Sanjay Kumar

Bandi Sanjay : కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలపై నిప్పులు చెరిగారు బండి సంజయ్. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా చేతులెత్తేసిందని బండి సంజయ్ అన్నారు. రైతాంగం విషయంలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ పంథానే ఇప్పటి కాంగ్రెస్ సర్కార్ కొనసాగిస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కార్ సైతం మాయ మాటలు చెప్పి రైతులను మోసం చేస్తోందని విరుచుకుపడ్డారు. ఇంతవరకు కొనుగోళ్లు ప్రారంభించ లేదన్నారు. రైతుల కోసం ఎల్లుండి కరీంనగర్ లో రైతు దీక్ష చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.

రేపు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అన్ని మండల కేంద్రాల్లో ఎమ్మార్వో ఆఫీసుల్లో వినతి పత్రాలను అందజేయనున్నారు. రైతులకు 2లక్షల రూపాయల రుణమాఫీ, పంట నష్ట పరిహారం, రైతులకు 500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ దీక్ష చేపట్టనున్నారు బండి సంజయ్. రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

”జంప్ జిలానీలు చాలామంది ఉంటారు. అధికారం ఎటు ఉంటే అటు పోతారు. ప్రజలు ఓట్ల సమయంలో అప్రమత్తంగా ఉండాలి. రాజకీయ ప్రక్షాళన జరగాలి. కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో పంటలు నష్టపోతే ఎందుకు పర్యటించ లేదు? నీ కొడుకు నిర్లక్ష్యం బయటపడుతుందని నల్గొండ పోయావు. రైతుల విషయంలో ఆందోళన చేసే అధికారం కేసీఆర్ కు లేదు. కాంగ్రెస్ పార్టీకి గురువు కేసీఆర్. ఇద్దరూ గురు శిష్యులుగా మారి రైతాంగాన్ని మోసం చేస్తున్నారు. రెండు పార్టీలు రైతు వ్యతిరేక పార్టీలు. రాజకీయం కోసం డ్రామాలాడుతున్నారు” అని బండి సంజయ్ ధ్వజమెత్తారు.

Also Read : దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ స్థానం మల్కాజిగిరిలో ఆధిపత్యమెవరిది?