Kotha Prabhakar Reddy: అంబులెన్స్ లో వచ్చి నామినేషన్ దాఖలు చేసిన బీఆర్ఎస్ అభ్యర్ధి కొత్త ప్రభాకర్ రెడ్డి
ఇటీవల ఓ వ్యక్తి కత్తితో దాడి చేయడంతో గాయపడిన ప్రభాకర్ రెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. బీఆర్ఎస్ అభ్యర్ధిగా దుబ్బాక నుంచి పోటీలో ఉండటం, నామినేషన్ దాఖలుకు ఎక్కువ సమయం లేకపోవటంతో

Kotha Prabhakar Reddy
Kotha Prabhakar Reddy Nomination : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. రేపటితో నామినేషన్ల దాఖలుకు గడువు ముగియనుండటంతో గురువారం రాష్ట్ర వ్యాప్తంగా భారీ సంఖ్యలో ఆయా పార్టీల అభ్యర్ధులు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ క్రమంలో దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్ధి కొత్త ప్రభాకర్ రెడ్డి గురువారం మధ్యాహ్నం నామినేషన్ దాఖలు చేశారు. ఇటీవల ఓ వ్యక్తి కత్తితో దాడి చేయడంతో గాయపడిన ప్రభాకర్ రెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. బీఆర్ఎస్ అభ్యర్ధిగా దుబ్బాక నుంచి పోటీలో ఉండటం, నామినేషన్ దాఖలుకు ఎక్కువ సమయం లేకపోవటంతో ఆస్పత్రి నుంచి అంబులెన్సులో నేరుగా దుబ్బాకు చేరుకున్నారు. వీల్ చైర్ లో రిటర్నింగ్ కార్యాలయానికి వెళ్లి నామినేషన్ పత్రాలను ఆర్వో గరిమ అగర్వాల్ కు కొత్తా ప్రభాకర్ రెడ్డి అందజేశారు.
Also Read : PM-KISAN : రైతులకు శుభవార్త…త్వరలో పీఎం కిసాన్ నిధులు…ఈకేవైసీ ఎలా పూర్తి చేయాలంటే…
బీఆర్ఎస్ మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధి కొత్త ప్రభాకర్ రెడ్డిపై గత నెల 30న హత్యాయత్నం జరిగింది. దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రభాకర్ రెడ్డిపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. దీంతో కడుపులో తీవ్ర గాయం కావడంతో ఆయన్న హుటాహుటీన ఆస్పత్రికి తరలించారు. తొలుత గజ్వేల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం యశోదా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు మెరుగైన చికిత్స అందించడంతో గాయం నుంచి కోలుకుంటున్నారు. అయితే, ప్రభాకర్ రెడ్డిపై దాడికి యత్నించిన వ్యక్తిని పోలీసులు రాజుగా గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.