‘ఎక్స్’లోకి ఎంట్రీ ఇచ్చిన కేసీఆర్.. చిత్రవిచిత్ర సంఘటనలు జరుగుతున్నాయని ట్వీట్

KCR: ప్రతిరోజు సీఎం, డిప్యూటీ సీఎం కరెంటు పోవడం లేదని ఊదరగొడుతున్నారని చెప్పారు.

‘ఎక్స్’లోకి ఎంట్రీ ఇచ్చిన కేసీఆర్.. చిత్రవిచిత్ర సంఘటనలు జరుగుతున్నాయని ట్వీట్

బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ ‘ఎక్స్’లోకి ఎంట్రీ ఇచ్చారు. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన ఇందులోకి ప్రవేశించారు. తన బస్సు యాత్రను దిగ్విజయం చేస్తున్న నాయకులకు, కార్యకర్తలకు, అభిమాన ప్రజలందరికీ అభినందనలు, ధన్యవాదాలు అని పేర్కొన్నారు.

ఇదే ఊపుతో బస్సు యాత్రను ముందుకు కొనసాగిద్దామని చెప్పారు. ఎన్నికల్లో గొప్ప విజయం సాధిద్దామని తెలిపారు. కాగా,  రాష్ట్రంలో చాలా చిత్ర విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయని కేసీఆర్ అన్నారు. తాను గంట క్రితం మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలతో కలిసి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారి ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు రెండు సార్లు కరెంటు పోయిందని తెలిపారు.

ప్రతిరోజు సీఎం, డిప్యూటీ సీఎం కరెంటు పోవడం లేదని ఊదరగొడుతున్నారని చెప్పారు. తనతో పాటు ఉన్న మాజీ శాసనసభ్యులు వారి వారి నియోజకవర్గాల్లో రోజుకు పదిసార్లు కరెంటు పోతున్నదని ఈ సందర్భంగా తనకు చెప్పారని తెలిపారు. తెలంగాణను పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ పరిపాలనా వైఫల్యానికి ఇంతకన్నా గొప్ప నిదర్శనం ఏముంటుందని నిలదీశారు.

Also Read: తెలంగాణ సీఈవో వికాస్ రాజ్‌కు బీజేపీ, బీఆర్ఎస్, వీహెచ్‌పీ ఫిర్యాదులు