Ryhtu Bharosa : సంక్రాంతి నుంచి రైతుభరోసా..! వారు మాత్రమే అర్హులు..!
గత 6 నెలలుగా రైతు భరోసా విధివిధానాలు, మార్గదర్శకాలకు సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా రైతుల అభిప్రాయాలతో పాటు వివిధ రంగాల ప్రముఖుల అభిప్రాయాలను క్యాబినెట్ సబ్ కమిటీ సేకరించింది.

Rythu Bharosa
Ryhtu Bharosa : సంక్రాంతి నుంచి రైతు భరోసా ఇవ్వాలని భావిస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. విధివిధానాల రూపకల్పనపై దృష్టి పెట్టింది. ఇందులో కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. గత ప్రభుత్వంలో లాగా నిబంధనలు లేకుండా రైతు భరోసా అందించకూడదని, సాగు చేసే రైతులకే ఇవ్వాలని సూత్రప్రాయం నిర్ణయించింది. ఇటు 10 ఎకరాల లోపు ఉన్న రైతులకే రైతు భరోసా ఇచ్చే అంశంపై క్యాబినెట్ భేటీలో చర్చించాలని నిర్ణయం తీసుకుంది.
రైతుల నుంచి అభిప్రాయాలు సేకరణ..
ఇటు మరోసారి వచ్చే వారం సబ్ కమిటీ భేటీ కానుంది. రైతు భరోసా పంపిణీ విధివిధానాలపై క్షుణ్ణంగా చర్చించనుంది. రానున్న యాసంగి పంటకు రైతుభరోసా అందించేందుకు ఖరారు చేయాల్సిన విధివిధానాలపై సబ్ కమిటీ చర్చించింది. పథకం ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు రైతు భరోసా అందించిన తీరుపై సమీక్షించింది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా సబ్ కమిటీ పర్యటించిన సమయంలో రైతుల వ్యక్తం చేసిన అభిప్రాయాలు, అధికారులు సేకరించి సమాచారంపైన మంత్రులు కసరత్తు చేశారు.
రైతు భరోసా విధివిధానాలు, మార్గదర్శకాలపై అభిప్రాయాలు సేకరణ..
సంక్రాంతి నుంచి రైతు భరోసా చెల్లించాలని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ మేరకు అందుకు సంబంధించిన కసరత్తును కేబినెట్ సబ్ కమిటీ చేసింది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన సమావేశమైన క్యాబినెట్ సబ్ కమిటీ.. దాదాపు గంటన్నర పాటు సమావేశమైంది. గత 6 నెలలుగా రైతు భరోసా విధివిధానాలు, మార్గదర్శకాలకు సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా రైతుల అభిప్రాయాలతో పాటు వివిధ రంగాల ప్రముఖుల అభిప్రాయాలను క్యాబినెట్ సబ్ కమిటీ సేకరించింది.
Also Read : తమ్మినేని సీతారాం జనసేనలోకి వెళ్తారంటూ ప్రచారం జరుగుతున్న వేళ.. ఆయనతో బొత్స కీలక భేటీ
సాగు చేసే రైతులకు, 10 ఎకరాలలోపు రైతులకే రైతుభరోసా?
అందులో ప్రధానంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం బేషరతుగా రైతుబంధు చెల్లించింది. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అలా కాకుండా కొన్ని నిబంధనలు పెట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. అందులో ప్రధానంగా పంటలు వేసిన భూములకు మాత్రమే రైతుభరోసా చెల్లించాలని, దాంతో పాటు ఎకరాల విషయంలో కొంత కటాఫ్ పెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. 7 నుంచి 10 ఎకరాల లోపు భూములు ఉన్న వారికే రైతుభరోసా చెల్లించాలని క్యాబినెట్ సబ్ కమిటీ ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది.
Also Read : పోలీసుల మరణ మృదంగం.. ప్రభుత్వానికి పట్టింపు లేదా?: హరీశ్ రావు ఆగ్రహం